ఈసారి చంద్రబాబు కుప్పం టూర్‌లో టెన్షన్, అడ్డుకుంటోన్న వైసీపీ, ఎన్నడూలేనది ఎన్టీఆర్ ఫ్యామిలీ కటౌట్లు దర్శనం

పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత... సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం కేడర్‌ తీవ్ర నిరాశ, ఆవేదనలో ఉన్న నేపథ్యంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు...

ఈసారి చంద్రబాబు కుప్పం టూర్‌లో టెన్షన్, అడ్డుకుంటోన్న వైసీపీ, ఎన్నడూలేనది ఎన్టీఆర్ ఫ్యామిలీ కటౌట్లు దర్శనం
AP Local Body Elections
Follow us

|

Updated on: Feb 25, 2021 | 12:10 PM

పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత… సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం కేడర్‌ తీవ్ర నిరాశ, ఆవేదనలో ఉన్న నేపథ్యంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మూడు రోజులు ఆయన ఇక్కడే ఉంటారు. మండలాల వారీగా… కార్యకర్తలతో భేటీకి ప్లాన్‌ చేశారు. అయితే, చంద్రబాబు కుప్పం టూర్‌ ఎప్పుడూ లేనిది ఈసారి టెన్షన్‌ రేపుతోంది. వైసీపీ నేతల వార్నింగ్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇన్నేళ్ల నుంచి నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, కరోనా టైమ్‌లోనూ కనీసం జనాన్ని పట్టించుకోలేదని, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా… అంటూ నిలదీస్తున్నారు వైసీపీ నేతలు.

ప్రతిపక్షనేత చంద్రబాబును వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత టూర్‌లో భద్రతను పెంచారు పోలీసులు. మరోవైపు ఎప్పుడూ లేనిది ఈసారి అధినేత టూర్లో ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫొటోలు ఆసక్తిగా మారింది. గతంలో చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఆయన ఫొటోలతోనే ఫ్లెక్సీలు పెట్టే వారు. ఇప్పుడు గుడుపల్లిలో పెట్టిన బ్యానర్లలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణల ఫొటోలు ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫొటోను కూడా బ్యానర్లలో పెట్టారు. అదే కుప్పంలో టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబును సొంత ఇలాకాలోనే ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలనే లక్ష్యంతో ఉంది వైసీపీ. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కొంతమేర సక్సెస్‌ అయింది. ఈ నేపథ్యంలో కుప్పం గడ్డపై టీడీపీ వార్నింగ్‌లు.. వైసీపీ అల్టిమేటమ్‌లు.. హై టెన్షన్‌ క్రియేట్ చేస్తున్నాయి. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌తో అవి మరింత పీక్‌కి వెళ్లాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమన్న వైసీపీ అన్నంత పనిచేస్తుందా? అదే జరిగితే.. తెలుగుతమ్ముళ్లు వైసీపీ శ్రేణులకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ఈ సందేహాలే ఇప్పుడు సెగలు రేపుతున్నాయి. పోలీసులు మాత్రం సిట్యువేషన్‌ సీరియస్‌గా కాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.

చంద్రబాబు కుప్పం టూర్‌ టెన్షన్‌ రేపుతోంది. ఇన్నేళ్ల నుంచి ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్క దాన్నీ నెరవేర్చలేదని వైసీపీ ఆరోపిస్తోంది. హంద్రీనీవా నుంచి నీళ్లు తెస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. అంతేకాదు చంద్రబాబు ఫ్లెక్సీ దగ్దం చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. చంద్రబాబు కుప్పానికి వస్తున్న సమయంలో ఈ వార్నింగ్‌ మంటలు మంటపుట్టిస్తున్నాయి. వైసీపీ హెచ్చరికలకు అదే రేంజ్‌లో బదులిచ్చింది టీడీపీ. తమ అధినేతను అడ్డుకోవడం అంత సులువేం కాదని కౌంటర్ ఇచ్చింది. పులివెందుల రాజకీయాలు ఇక్కడ కుదరవని తేల్చిచెప్పింది.

చంద్రబాబు కుప్పానికి వస్తున్నారంటే గతంలో ఓ రేంజ్‌లో స్వాగత ఏర్పాట్లు ఉండేవి. కానీ ఇప్పుడు నిరసనలు స్వాగతం పలికే సీన్లు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎందుకిలా మారింది..? చంద్రబాబు..కుప్పం. ఈ రెండు పేర్లకు బలమైన బంధం ఏర్పడి దశాబ్దాలవుతోంది. వైఎస్ కుంటుంబానికి పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం అలాగ. టీడీపీ బాస్‌ ఎక్కడున్నా కనుసైగతో కుప్పంను శాసిస్తారు. అక్కడ ఆయన మాటే వేదం.. శాసనం. అలాంటిది 2019 ఎన్నికల నుంచి అక్కడ టీడీపీ హవా తగ్గుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మెజార్టీ తగ్గడం.. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ హవాతో సమీకరణాలు మారినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేజారకుండా కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకే చంద్రబాబు సొంత ఇలాఖాకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి అసెంబ్లీ ఎన్నికల నుంచి కుప్పంలో స్పెషల్‌ ఎఫెర్ట్‌ పెట్టిన వైసీపీ.. పంచాయతీ ఎన్నికల నాటికి వ్యూహం మార్చేసింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీడీపీకి 13 దక్కాయి. ఈ ఫిగర్‌ చూసిన తర్వాత టీడీపీ శిబిరంలో కలకలం మొదలైంది. కుప్పంలో ఏం జరుగుతుందా అన్న ఆందోళన మొదలైంది. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. పసుపు జెండా ఎగరడం మాత్రం ఖాయంగా వస్తుంది. ఈ కోటకు బీటలు వేయాడమే లక్ష్యంగా వైసీపీ రచించిన వ్యూహం టీడీపీ శ్రేణులతో పాటు అధినేతకు మైండ్‌ బ్లాంక్‌ చేసినంత పని చేసింది. ఊహకు అందని విధంగా వైసీపీ కుప్పంలో పుంజుకుందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు పంచాయతీ ఫలితాలు చూసిన తర్వాత వెంటనే కుప్పం వెళ్లాలని చంద్రబాబు డిసైడైనట్టు తెలుస్తోంది.

Read also : రాను, రాలేను, ఇదంతా నావల్లకాదంటూ తెగేసి చెప్పేశారు, అయినా రజనీ అభిమానుల్లో ఆశ, రేపటి వేడుక కోసం ఎదురుచూపులు