టీడీపీ బుజ్జగింపులకు బెట్టువీడని ఎస్పీవై రెడ్డి
నంద్యాల ఎంపీ, మాజీ టీడీపీ నేత, ప్రస్తుత జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నించినా అందుకు ఆయన అంగీకరించలేదు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ గురువారం ఆయనతో నంద్యాలలో భేటీ అయ్యారు. ఎస్పీవైరెడ్డి కుటుంబం టీడీపీకి మద్దతు ఇవ్వాలని, సీఎం ఇచ్చిన ఎమ్మెల్సీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీ కోరినట్లు తెలిసింది. పరిశ్రమల రుణాల వెసులుబాటుతో మరో విధంగా న్యాయం చేస్తామని టీజీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఎస్పీవైరెడ్డి ఆ […]
నంద్యాల ఎంపీ, మాజీ టీడీపీ నేత, ప్రస్తుత జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నించినా అందుకు ఆయన అంగీకరించలేదు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ గురువారం ఆయనతో నంద్యాలలో భేటీ అయ్యారు. ఎస్పీవైరెడ్డి కుటుంబం టీడీపీకి మద్దతు ఇవ్వాలని, సీఎం ఇచ్చిన ఎమ్మెల్సీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీ కోరినట్లు తెలిసింది. పరిశ్రమల రుణాల వెసులుబాటుతో మరో విధంగా న్యాయం చేస్తామని టీజీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఎస్పీవైరెడ్డి ఆ పదవేదో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారికి ఇచ్చి తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
ప్రజల మద్దతు తమకే ఉందని ఎస్పీవై రెడ్డి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రయత్నాలు సీట్లు ఖరారు చేసే సమయంలో ఎందుకు చేయలేదని ఎస్పీవై రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయనతో చర్చలు ఫలించకపోవడంతో టీజీ వెంకటేశ్ నిరాశతో వెనుదిరిగారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, నంద్యాల అసెంబ్లీకి ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డి, బనగానపల్లెలో కుమార్తె అరవిందరాణి పోటీలో నిలిచారు.