AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PoKలో పాక్ వ్యతిరేక అగ్నిజ్వాలలు.. పాక్ బలగాల కాల్పులతో ఆందోళనలు హింసాత్మకం!

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇస్లామాబాద్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజాసంఘాలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అరెస్టులు, అదృశ్యమైన వ్యక్తులపై దర్యాప్తు, భద్రతా బలగాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాల రద్దు, ఇంటర్నెట్ ఆంక్షల ఎత్తివేత వంటి డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

PoKలో పాక్ వ్యతిరేక అగ్నిజ్వాలలు.. పాక్ బలగాల కాల్పులతో ఆందోళనలు హింసాత్మకం!
Pok Violence
Balaraju Goud
|

Updated on: Jul 29, 2026 | 10:22 AM

Share

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇస్లామాబాద్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజాసంఘాలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అరెస్టులు, అదృశ్యమైన వ్యక్తులపై దర్యాప్తు, భద్రతా బలగాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాల రద్దు, ఇంటర్నెట్ ఆంక్షల ఎత్తివేత వంటి డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

స్థానిక వనరులపై ప్రజలకే పూర్తి హక్కులు కల్పించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 5 నుంచి ప్రారంభమైన నిరసనలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా రావలకోట్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పినట్లు సమాచారం.

గత 24 గంటల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో భారీగా రక్తపాతం జరిగినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలపై అధికారిక ధ్రువీకరణ పూర్తిగా అందాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో భద్రత కోసం 14 వేల మందికి పైగా బలగాలను మోహరించినట్లు సమాచారం. ఆందోళనలను అణచివేసేందుకు భద్రతా బలగాలు కాల్పులకు దిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ సేవలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇంటర్నెట్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయని, దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాద సంస్థల దాడుల ముప్పు పెరగడంతో భద్రతా అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు అంతర్గత నిరసనలు, మరోవైపు ఉగ్రవాద దాడులతో పాక్ ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

PoKలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న మాజీ SSG కమాండో ఫారూక్ సుధాన్ కూడా భద్రతా బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మాంగ్ ప్రాంతంలోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఆయన గతంలో పాక్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి కావడంతో ఈ ఘటనపై మరింత చర్చ జరుగుతోంది.

సొంత దేశానికి చెందిన మాజీ సైనికుడిపైనా కాల్పులు జరిగాయన్న ఆరోపణలతో PoKలో ఆగ్రహం మరింత పెరిగింది. ప్రజల డిమాండ్లు, భద్రతా బలగాల చర్యలు, రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రాంత పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పాక్ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us