AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌ ఫిరంగి..నేను ఏకే 47- నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్ధూ

సిమ్లా: లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా చివరి దశ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌..ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో గంగ పుత్రుడిగా చెప్పుకొన్న మోదీ..ఇప్పుడ రఫేల్‌ కుంభకోణానికి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘అవినీతి చేయను..ఎవర్నీ చేయనివ్వను’ అన్న […]

రాహుల్‌ ఫిరంగి..నేను ఏకే 47- నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్ధూ
Ram Naramaneni
|

Updated on: May 16, 2019 | 2:08 PM

Share

సిమ్లా: లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా చివరి దశ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌..ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో గంగ పుత్రుడిగా చెప్పుకొన్న మోదీ..ఇప్పుడ రఫేల్‌ కుంభకోణానికి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘అవినీతి చేయను..ఎవర్నీ చేయనివ్వను’ అన్న మోదీ నినాదంలో ఎంత మాత్రం నిజముందో చర్చలో పాల్గోని తేల్చుకోవాలన్నారు సిద్ధూ. ఈ చర్చల్లో తాను విఫలమయితే..రాజకీయాలను నుంచి తప్పుకొంటానన్నారు. రాహుల్‌లో గెలుపు పట్ల ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని.. ‘ఆయన ఫిరంగి అయితే నేను ఏకే 47’ అని సిద్ధూ అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌ సభ స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని దశల ఎన్నికలకు ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి.