బాబు, జగన్ ప్రధాని పీఠమెక్కినా ‘హోదా’ కుదరదు, పోలవరంకు కొత్తగా నిధుల కేటాయింపు అక్కర్లెద్దు, బడ్జెట్‌పై సుజనా మాట

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గురించి 'ఎన్నికల బడ్జెట్' అంటూ వైసీపీ నేతలు మాట్లాడ్డం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అన్నారు...

బాబు, జగన్ ప్రధాని పీఠమెక్కినా 'హోదా' కుదరదు,  పోలవరంకు కొత్తగా నిధుల కేటాయింపు అక్కర్లెద్దు,  బడ్జెట్‌పై సుజనా మాట
Follow us

|

Updated on: Feb 01, 2021 | 11:01 PM

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గురించి ‘ఎన్నికల బడ్జెట్’ అంటూ వైసీపీ నేతలు మాట్లాడ్డం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ మౌలిక సదుపాయాలు పెంచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసుల ఉపసంహరణ కోసం చేసే ప్రయత్నాల్లో కొంతైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయడం లేదని ఎద్దేవా చేశారు.

అక్రమ మార్గాలలో ఆంధ్రప్రదేశ్ చేసే అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తిమీద గుదిబండలా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని సార్లు ఢిల్లీ పర్యటన జరిపిన ఏపీ సీఎం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లలేదని దెప్పిపొడిచారు. ఢిల్లీ వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైన సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021 బడ్జెట్ చాలా గొప్పగా ఉందని సుజనా అన్నారు.

విద్య, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఉచిత వాక్సిన్ కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించడం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడంలో కూడా భారతదేశం విజయం సాధించిందని అన్నారు. కుదేలైన పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఇప్పటికే అనేక మార్లు వివిధ రకాలుగా స్పందించిన ఎంపీ సుజనా చౌదరి ఈ సారి మరో టైపులో రియాక్టయ్యారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ప్రధాని పీఠమెక్కినా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని సుజనా చౌదరి తేల్చి చెప్పారు. దానికి బదులు రాష్ట్రానికి కావాల్సినవేంటో కేంద్రాన్ని అడిగి సాధించుకోవాలని సూచించారు. , అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న సామెతను గుర్తుపెట్టుకోవాలని సుజనా చెప్పుకొచ్చారు.

పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా నిధులు కేటాయింపు జరపాల్సిన అవసరమే లేదని, గత బడ్జెట్లలోనే నిధుల సమీకరణకు నాబార్డుతో లంకె పెట్టారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..