AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Singh: వివాదాలతో సహవాసం అతడి జీవితం.. వాజ్‌పెయ్‌తో వైరం.. పార్టీ నుంచి బహిష్కరణలు..

Kalyan Singh: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేడు అధికారంలో ఉంది. వరుసగా రెండు లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు పార్టీకి పూర్తి మెజారిటీ అందించారు.

Kalyan Singh: వివాదాలతో సహవాసం అతడి జీవితం.. వాజ్‌పెయ్‌తో వైరం.. పార్టీ నుంచి బహిష్కరణలు..
Kalyan Singh
uppula Raju
|

Updated on: Aug 21, 2021 | 11:41 PM

Share

Kalyan Singh: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేడు అధికారంలో ఉంది. వరుసగా రెండు లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు పార్టీకి పూర్తి మెజారిటీ అందించారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కూడా బిజెపి జెండా రెపరెపలాడుతోంది. కానీ అది అంత సులువుగా జరగలేదు. ఈ ప్రయాణంలో జనసంఘ్ నాయకులు ఎందరో బీజేపీ తరపున పోరాడారు. అందులో యూపీ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఒకరు. జన్ సంఘ్ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న కళ్యాణ్ సింగ్ 1991లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ సింగ్ పార్టీకి, ప్రత్యేకించి కార్యకర్తలకు బీజేపీ కేవలం ప్రతిపక్షంలో కూర్చునే పార్టీ కాదని విశ్వాసం పెంచారు.

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత కళ్యాణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. BBC నివేదిక ప్రకారం.. బాబ్రీ మసీదును కర సేవకులు స్వాధీనం చేసుకున్నప్పుడు కళ్యాణ్ సింగ్ తన నివాసంలో అధికారులతో ఉన్నారు. మసీదు చివరి ఇటుక పడిపోయిన వార్త తెలిసిన వెంటనే కళ్యాణ్ సింగ్ తన రైటింగ్ ప్యాడ్‌ని ఆర్డర్ చేసి తన చేతులతో రాజీనామా లేఖను రాసి గవర్నర్‌కి అందించారు. కళ్యాణ్ సింగ్ లాల్ కృష్ణ అద్వానీ శిబిరానికి నాయకుడిగా పరిగణించారు. కళ్యాణ్ సింగ్ తన పార్టీకి చెందిన అతిపెద్ద నాయకుడు, దేశ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయితో విభేదించాడు.

తను కూడా ప్రధాని కావాలని కోరుకుంటున్నానని తన మనసులో మాట వెల్లడించాడు. కానీ దాని కోసం ముందుగా ఎంపీ కావల్సి ఉంది. అయితే ఈ ప్రకటన కారణంగా అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పుడు వాజ్‌పేయి లక్నో నుంచి ఎంపీ అవ్వడమే కాకుండా దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు. వాజ్‌పేయితో గొడవ పడిన తరువాత అతని రాజకీయ జీవితం క్షీణించింది. తరువాత అతను తన సొంత పార్టీని కూడా స్థాపించారు కానీ విజయం సాధించలేదు. ములాయం సింగ్ యాదవ్ నుంచి రాజకీయ సాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులకు ఇద్దరి మధ్య విభేదాల రావడంతో విడిపోయారు. తర్వాత జరిగిన పరిణామాల కారణంగా కళ్యాణ్ సింగ్‌ మళ్లీ యూపీ సీఎం కుర్చీకి దగ్గరయ్యారు.

Kalyan Singh: అయోధ్య రామమందిర ఉద్యమంలో అతడిది కీలక పాత్ర.. బాబ్రీ మసీద్‌ ఘటన కారణంగా సీఎం పదవికి రాజీనామా

RealMe Laptop: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ మొదటి ల్యాప్‌టాప్ రియాలిటీ బుక్‌..

ఆఫ్ఘన్ నుంచి పారిపోయేందుకు వేలాది మంది యత్నం.. గుంపులను చెదరగొట్టేందుకు అమెరికన్ దళాల బాష్పవాయు ప్రయోగం