AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఓట్ల గల్లంతుపై విచారణ వాయిదా.. విద్యార్థిని పిటిషన్‌పై ఈ నెల 27న విచారిస్తామన్న హైకోర్టు

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సరిగా లేదంటూ హైకోర్టులో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని..

ఏపీలో ఓట్ల గల్లంతుపై విచారణ వాయిదా.. విద్యార్థిని పిటిషన్‌పై ఈ నెల 27న విచారిస్తామన్న హైకోర్టు
K Sammaiah
|

Updated on: Jan 25, 2021 | 1:11 PM

Share

ఏపీలో ఓట్ల గల్లంతు విషయంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది ధర్మాసనం. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సరిగా లేదంటూ హైకోర్టులో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని పిటిషన్‌ దాఖలు చేశారు.

పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కొత్తగా ఓటు హక్కు వచ్చిన తమకు దానిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి అఖిల నివేదించారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంవల్ల కొత్తగా ఓటు హక్కు వచ్చిన 3 లక్షల మంది నష్టపోతారని వివరించారు

18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని అధికరణ 326 కల్పిస్తోందని హైకోర్టుకు తెలిపారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని అఖిల కోరారు.

Follow Us