వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లోపడ్డ గవర్నర్

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవ్యక్తులు ఏ రాజకీయ పార్టీకి, నాయకుడికి వత్తాసు పలకరాదని, తటస్థంగానే వ్యవహారించాలన్న నియమనిబంధలను ఉల్లంఘించి రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ మోదీ ప్రధాని అవుతారని, ఆయన ప్రధాని కావడం దేశానికి అనివార్యమని కల్యాణ్ సింగ్ అన్నారు. అలీగఢ్‌లో ఈనెల 23న ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ, తామంతా […]

వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లోపడ్డ గవర్నర్
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2019 | 8:58 PM

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవ్యక్తులు ఏ రాజకీయ పార్టీకి, నాయకుడికి వత్తాసు పలకరాదని, తటస్థంగానే వ్యవహారించాలన్న నియమనిబంధలను ఉల్లంఘించి రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ మోదీ ప్రధాని అవుతారని, ఆయన ప్రధాని కావడం దేశానికి అనివార్యమని కల్యాణ్ సింగ్ అన్నారు.

అలీగఢ్‌లో ఈనెల 23న ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ, తామంతా బీజేపీ కార్యకర్తలమని, బీజేపీ విజయం సాధించాలని తాము కోరుకుంటామని చెప్పారు. మళ్లీ మోదీనే ప్రధాని కావాలని, ఇది దేశానికి చాలా ముఖ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను రాజస్థాన్ గవర్నర్‌గా నియమించింది.