గోరంట్ల మాధవ్కు దొరకని రిలీవ్.. బరిలోకి భార్య
హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి మారే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు ఆయన భార్య సవితకు బీఫామ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సోమవారం ఎంపీ అభ్యర్థిత్వానికి సవిత నామినేషన్ కూడా దాఖలు చేస్తారని సమాచారం. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. కాగాఎంపీగా పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామాను చేశారు మాధవ్. అయితే గోరంట్లకు ఇంకా రిలీవింగ్ లెటర్ […]
హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి మారే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు ఆయన భార్య సవితకు బీఫామ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సోమవారం ఎంపీ అభ్యర్థిత్వానికి సవిత నామినేషన్ కూడా దాఖలు చేస్తారని సమాచారం. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు.
కాగాఎంపీగా పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామాను చేశారు మాధవ్. అయితే గోరంట్లకు ఇంకా రిలీవింగ్ లెటర్ అందలేదు. ఇవాళ, రేపు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు. మరోవైపు సోమవారంతో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో మాధవ్ భార్య సవితను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఆమెకు బీఫాం ఇచ్చినట్లు సమాచారం.