AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ఉత్పత్తిపై రాజకీయ దుమారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 మద్యం మద్యం డిస్టిల్లరీలలో సోమవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ప్రపంచమంతా కరోనాకు మందు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే...

మద్యం ఉత్పత్తిపై రాజకీయ దుమారం
Rajesh Sharma
| Edited By: |

Updated on: May 03, 2020 | 11:43 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 మద్యం మద్యం డిస్టిల్లరీలలో సోమవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ప్రపంచమంతా కరోనాకు మందు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మద్యం తయారీపై దృష్టి సారించారని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఎవరు వెళ్లొద్దు అని స్పష్టంగా చెప్పింది అంటే ఏపీలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూ ఉంటే నిత్యావసర దుకాణాలు మూసివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటని కళావెంకట్రావు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. మద్యం షాపులు ఏమైనా మెడికల్ షాపులా అని ప్రశ్న వేశారాయన. విపత్కర పరిస్థితుల్లో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏంటని.. కేవలం జే టాక్సు కోసమే ప్రజల ప్రాణాలు తీస్తారా అని నిలదీశారు వెంకట్రావు.

అయితే తెలుగుదేశం పార్టీ ఆరోపణలను వైసీపీ నేతలు తోసిపుచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని ఎత్తివేసింది ఎవరో గుర్తు చేసుకోవాలంటూ కళావెంకట్రావుకు చురకలంటించారు వైసీపీ నేతలు. కరోనా వైరస్ నియంత్రాణకు అత్యధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్న విషయం తెలుగుదేశం నాయకులు గుర్తించాలని వైసిపి నేతలు అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని, తెలుగుదేశం నేతలు అనవసర రాజకీయ రాద్ధాంతాలు మానుకోవాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.