AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేవంత్ గారూ! నెక్స్ట్ గేమ్ ప్లాన్ ఏంటి?

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప పోరుకు సైరన్ మోగింది.  నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఇక టీఆర్ఎస్ తరపున గతంలో పోటీ చేసిన సైదిరెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్ధి విషయంలో మాత్రం క్లారిటీ లేదు.  ఇప్పటికే టీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. తెలంగాణ పీసీసీ […]

రేవంత్ గారూ! నెక్స్ట్ గేమ్ ప్లాన్ ఏంటి?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 23, 2019 | 10:21 PM

Share

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప పోరుకు సైరన్ మోగింది.  నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఇక టీఆర్ఎస్ తరపున గతంలో పోటీ చేసిన సైదిరెడ్డి బరిలో ఉన్నారు.

బీజేపీ అభ్యర్ధి విషయంలో మాత్రం క్లారిటీ లేదు.  ఇప్పటికే టీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన స్థానం కావడంతో   కాంగ్రెస్‌లో ఇక్కడ గెలుపు అధికారపక్షానికి, విపక్షానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. కాగా ఇదంతా పక్కనపెడితే  రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో ఎలాంటి ఎత్తుగడ అనుసరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

క్రమశిక్షణా చర్య కింద టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఇటీవల కుంతియాకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి… హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ తరపున  కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రేవంత్‌పై ఫైరయ్యారు.  ఉపఎన్నిక సమయంలో వర్గపోరు కాంగ్రెస్ వర్గాలను కలవరపెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ సతీమణి పద్మావతికి టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయం కావడంతో… రేవంత్ రెడ్డి ఆమెకు పోటీగా కిరణ్ రెడ్డి అనే వ్యక్తిగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడాలని రేవంత్ రెడ్డి బలంగా నిర్ణయించుకుంటే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను అభ్యర్థిగా ప్రకటిస్తే… కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆమెకు మద్దతు ఇస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. మొత్తానికి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ టార్గెట్‌గా రాజకీయాలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి… హుజూర్ నగర్ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరి రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.