Huzurabad By Election Counting: సేవ చేసేవారికి ఇది నిజమైన గుర్తింపు.. హుజురాబాద్ ఫలితాలపై బండి సంజయ్ కామెంట్స్..

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. నిజమైన సేవ చేసేవారికే ప్రజలు పట్టం..

Huzurabad By Election Counting: సేవ చేసేవారికి ఇది నిజమైన గుర్తింపు.. హుజురాబాద్ ఫలితాలపై బండి సంజయ్ కామెంట్స్..
Bandi Sanjay
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 02, 2021 | 1:59 PM

Bandi Sanjay: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. నిజమైన సేవ చేసేవారికే ప్రజలు పట్టం కడుతారని అన్నారు. నాపల్లిలోని రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురబోతోందని విశ్వసం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్డం ఖాయమన్నారు. దళిత బంధుపై అడిగిన ప్రశ్నకు ఆయన అదే స్థాయిలో జవాబిచ్చారు.

ఇదిలావుంటే నియోజకవర్గ ప్రజలు కరీంనగర్‌ జిల్లా కేంద్రంకు చేరుకుంటున్నారు. దీంతో జిల్లా కేంద్రం బీజేపీ కార్యకర్తల హల్‌చల్‌‌తో సందడిగా మారింది. రౌండ్ రౌండుకు బీజేపీకి ఆధిక్యం పెరుగుతుండడంతో ఈటల క్యాంప్‌ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు క్యూకడుతున్నారు.

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేక పోవడంతో కరీంనగర్‌లోకి ఎంటర్‌ కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కరీంనగర్‌ శివారులోని మానకొండూరు KSR గార్డెన్‌ వరకే అనుమతించారు. గార్డెన్‌కు వచ్చిన ఈటల కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇవి కూడా చదవండి: Huzurabad By Election Result Live Counting: నాలుగవ రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం.. టీఆర్ఎస్‌కు ఎన్ని ఓట్లు..

Captain vs Etela: అసలేం జరిగింది.. టీఆర్ఎస్ ఇలాఖాలో ఈటల పాగా.. కెప్టెన్‌‌కు భారీ దెబ్బ..

Latest Articles