AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad by – election : ఈటలకు మరో షాక్.. కారెక్కనున్న ప్రధాన అనుచరుడు

బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం ఈటలకు ప్రధాన అనుచరులుగా..

Huzurabad by - election :  ఈటలకు మరో షాక్.. కారెక్కనున్న ప్రధాన అనుచరుడు
Etela Rajender
Venkata Narayana
|

Updated on: Jul 27, 2021 | 12:56 PM

Share

Etela Rajender – Huzurabad by – election : బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం ఈటలకు ప్రధాన అనుచరులుగా ఉన్నవారిలో అనేక మంది ఆయనకు షాక్ మీద షాకులిస్తున్నారు. ఈటెల రాజేందర్ ముఖ్య అనుచరుడుగా ఉండిన దేశిని కోటి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం నియోజకవర్గంలో సంచలనమైంది. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కోటి భార్య దేశిని స్వప్న కూడా తాను టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ ఉదయం విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేశారు.

కాగా, ఈటల ప్రధాన అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్‌ కూడా రాజేందర్‌కు పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బండా శ్రీనివాస్. విద్యార్ధి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని తన సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న బండా శ్రీనివాస్.. ఈటలకు హ్యాండివ్వడం హుజురాబాద్ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్ గా బండా శ్రీనివాస్‌ను ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001 లోనే చేరి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో బండా చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో శ్రీనివాస్ పనిచేశారు. వీళ్లే కాకుండా ఈటల అనుచరులుగా ఉన్న అనేక మంది కార్యకర్తలు సైతం ఇప్పుడు ఈటలను వీడి టీఆర్ఎస్ వైపు వెళ్లిపోతుండం ఈటలను అసౌకర్యానికి గురిచేస్తున్నట్టు సమాచారం.

Read also : Fish Curry : అయ్యో పాపం.. రాత్రి చేపల పులుసు తిన్నారు.. తెల్లారికి విగత జీవులయ్యారు