Afghanistan Crisis: ఆప్ఘనిస్థాన్ వార్.. మనదేశ వాణిజ్యంపై ప్రభావం.. ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయంటే
Afghanistan Crisis: ఆ దేశం సైన్యం ఉగ్రవాదులకు సలాం చేసింది. దేశ అధ్యక్షుడు ఆ దేశం నుంచి పారిపోయాడు. ఆ దేశం ఆఫ్ఘానిస్తాన్. ఈ నేపథ్యంలో ఆ దేశంతో వర్తక, వ్యాపార వాణిజ్యాలను నెరిపే దేశాలపై ప్రభావం పడింది. దీంతో భారత దేశంలో ఏయే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయో చూద్దాం
Updated on: Aug 17, 2021 | 10:36 AM

ఆప్ఘనిస్థాన్, భారత్ మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ ఎగుమతుల వాటా 826 మిలియన్ డాలర్లు కాగా.. అఫ్గాన్ వాటా 510 మిలియన్ డాలర్లు ఉంది.

ఆప్ఘనిస్థాన్ నుంచి కొన్ని వస్తువుల్ని భారత్ దిగుమతి చేసుకునేది. అవి... డ్రై ఫ్రూట్స్. కిస్మిస్, వాల్నట్స్, బాదం, పిస్తా, పైన్ నట్స్, చెర్రీ, పుచ్చకాయలు సహా పలు ఆయుర్వేద మూలికలను ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఎండు ద్రాక్ష అక్కడి నుంచి పెద్ద ఎత్తున భారత్ వస్తున్నాయి. ఇప్పుడు వాటి ధర విపరీతంగా పెరగనుంది.

ఇక మన దేశం నుంచి ఆప్ఘనిస్థాన్ కు తేయాకు, కాఫీ, మిరియాలు, పత్తి వంటివి ఎగుమతి అవుతున్నాయి.

ఔషధ నూనె గింజలతో పాటు జీలకర్రను కూడా భారత దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు దిగుమతులపై ప్రభావం చూపించనున్న నేపథ్యంలో జీలకర్ర భగ్గున మండనుంది. దీంతో జీలకర్ర ఇంకా పెరగడం ఖాయం. కనుక ముందుగానే కొనుక్కొని దాచుకోవడం మంచిది


అఫ్గాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై ఇక్కడి ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అఫ్గాన్ పరిస్థితుల ప్రభావం తప్పకుండా ఉంటుందని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతిదారులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు.




