కాళ్ల వాపు, తుంటి కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, అజీర్ణం, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం కనిపించడం వంటివి కూడా కిడ్నీ సమస్యల లక్షణాలే. ఇవి సంభవిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. మూత్రపిండాల సమస్యలను నివారించడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. బదులుగా, ఎక్కువ నీరు, పండ్లు, కూరగాయలు తినాలి. అలాగే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.