- Telugu News Photo Gallery Viral photos Know about navapur railway station which is between two states gujarat and maharashtra viral photos
Viral: భారతదేశంలో ప్రత్యేక రైల్వే స్టేషన్.. సగం మహారాష్ట్రలో.. మరో సగం గుజరాత్లో.. ఎందుకో తెలుసా!
భారతదేశంలో ఇదొక ప్రత్యేకమైన రైల్వే స్టేషన్. ఎందుకు విచిత్రమంటే.! ఈ స్టేషన్లోని సగం గుజరాత్లో.. మరో సగం మహారాష్ట్రలో ఉంటుంది. అదేంటి అలా.? అనుకుంటున్నారా.! అయితే ఈ స్టోరీ చదవండి..
Updated on: Nov 04, 2021 | 1:32 PM

మీరు సోషల్ మీడియాలో అనేక వింత పేర్లున్న రైల్వే స్టేషన్స్ గురించి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఓ ప్రత్యేక రైల్వే స్టేషన్ గురించి విన్నారా.? అది కూడా మనదేశంలోనే. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.! అందులో సగం ఒక రాష్ట్రానిది.. మరో సగం మరో రాష్ట్రానిది. అసలు ఈ స్టేషన్ రెండు రాష్ట్రాలకు ఎలా విభజించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ ప్రత్యేక రైల్వేస్టేషన్ పేరు- నవాపూర్ రైల్వే స్టేషన్. ఇది గుజరాత్-మహారాష్ట్ర బోర్డర్లో ఉంది. ఈ స్టేషన్లో సగం గుజరాత్లో.. మరొక సగభాగం మహారాష్ట్రలో ఉంటుంది. దీనికి అద్దం పట్టే విధంగా ఈ స్టేషన్లోని ఓ కుర్చీ రెండు భాగాల విభజించబడినట్లు మీరు ఫోటోలో చూడవచ్చు.

ఇక కన్వీనియన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది.

ఈ స్టేషన్ను గుజరాత్, మహారాష్ట్ర విభజనకు ముందు నిర్మించారు. విభజన అనంతరం కూడా ఈ స్టేషన్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో.. ఇది రెండు రాష్ట్రాల కిందకు వచ్చింది.

ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేక పద్ధతిలో విభజించబడింది. రైలు ప్లాట్ఫార్మ్పైకి వచ్చేది, ఆగేది గుజరాత్ ప్రాంతంలోకి వస్తే.. ఈ స్టేషన్ క్లరికల్ పని మొత్తం మహారాష్ట్ర ప్రాంతంలో జరుగుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఈ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫార్మ్స్ గుజరాత్లో.. స్టేషన్కి సంబంధించిన కార్యాలయాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటాయి.
