
దేశవ్యాప్తంగా వినాయకుడి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. పట్నం, పల్లెల్లో ప్రతి వాడలో గణపతి బప్పా మోరియా అంటూ వాడ వాడలు మారిమోగిపోతున్నాయి. అయితే ఈరోజున కొందరు వాడలు లేదా తమ అపార్ట్ మెంట్లో వినాయకుడిని పూజించుకుంటే, మరికొంత మంది మాత్రం తమ ఇంటిలో వినాయకుడి ప్రతిష్టించుకొని పూజ చేస్తుంటారు. అయితే ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసే క్రమంలో అస్సలే కొన్ని పనులు చేయకూడదంట.

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రం కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే వినాయక చవితి రోజున ఇంటిలో గణేష్ విగ్రహం పెట్టుకునేముందు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోయి, ఆనందంగా జీవించాలి అంటే తప్పక వాస్తు టిప్స్ పాటించాలి. లేకపోతే మానసిక ఒత్తి, ఆర్థిక ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉంటుందంట.

వినాయకుడి విగ్రహం పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంట. ముఖ్యంగా గణపయ్య విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య మూల పెట్టడం చాలా మంచిదంట. దీని వలన ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగపరంగా కలిసివస్తుందంట. ఇంటిలో పాజిటివ్ వైబ్స్ రావడమే కాకుండా, ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

ఇక వినాయకుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టడం వలన సంపద పెరుగుతుందంట. అలాగే పడమర దిశలో పెట్టడం వలన జీవితం నిలకడగా సాగుతుందని చెబుతున్నారు పండితులు. అయితే విగ్రహం పెట్టే సమయంలో తప్పక కొన్ని సూచనలు మాత్రం గుర్తుంచుకోవాలంట.

అందులో ఒకటి వినాయకుడి విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకునే సమయంలో, వి గ్రహం ఎప్పుడూ తూర్పు లేదా, ఉత్తరం వైపు మాత్రమే చూడాలంట. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం వైపు చూడకూడదు. ఇలా చూసేలా పెట్టడం వలన చాలా సమస్యలు వస్తాయంట.