Ravi Kiran |
Updated on: Feb 16, 2022 | 9:59 AM
ప్రస్తుతం విదేశాలు వెళ్లడం అందరికీ సర్వసాధారణమైపోయింది. వీలు దొరికినప్పుడల్లా అందమైన పర్యాటక ప్రదేశాలను ఓ చుట్టు చుట్టి వచ్చేస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో మీరు పర్యటించినప్పుడు.. విమానం ఛార్జీలు, హోటల్ ఖర్చులు, ఫుడ్, మొదలైన వాటితో బిల్లులు తడిసి మోపెడు అవుతుంటాయి. కానీ భారత్కు సమీపంలోని కొన్ని దేశాలకు మీరు తక్కువ ఖర్చుతో.. సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. మరి ఆ దేశాలు ఏంటో చూసేద్దాం పదండి.!
మలేషియా: మీకు పర్వతారోహణ ఇష్టముంటే.. అందుకు మలేషియా బెస్ట్ ఆప్షన్. బీచ్లు, అడవులు, చారిత్రాత్మక కట్టడాలు.. ఇలా ఎన్నో మలేషియాలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోని అనేక రకాల పువ్వులను మీరు మలేషియా చూడొచ్చు. అక్కడ ఫుడ్ను కూడా పర్యాటకులు బాగా ఇష్టపడతారు. విమానం ఛార్జీ: రూ. 20-25 వేలు ఒక రోజు ఖర్చు: రూ. 3,500- 5 వేలు
కంబోడియా: కంబోడియాలో అంగ్కోర్ వాట్ దేవాలయం ప్రసిద్ధి. రాయల్ ప్యాలెస్, నేషనల్ మ్యూజియం, చారిత్రిక ప్రదేశాలు అనేకం. పాశ్చాత్య దేశాల కంటే కంబోడియాలోకి ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. విమానం ఛార్జీ: రూ. 25-30 వేలు ఒక్క రోజు ఖర్చు: రూ. 3-5 వేలు
శ్రీలంక: బీచ్లు, పర్వతాలు, పచ్చని ప్రకృతికి శ్రీలంక ప్రసిద్ధి. తక్కువ ఖర్చుతో విదేశీ పర్యటన చేసేందుకు శ్రీలంక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కొలంబో, నేగోమ్బో నగరాలు పర్యాటకంగా చూడదగ్గ ప్రదేశాలు. విమానం ఛార్జీ: రూ. 10-18 వేలు ఒక్క రోజు ఖర్చు: రూ. 1,500 - 2 వేలు
నేపాల్: ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్తోపాటు.. ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి. భారతీయులకు ఇక్కడి వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఇక్కడి భౌద్ధ స్టూపాలను చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. విమానం ఛార్జీ: రూ. 10-15 వేలు, నేపాల్ బోర్డర్లో ఉన్నవారికి.. బస్సులో నేపాల్ చేరుకోవడం చాలా చౌక. ఒక్క రోజు ఖర్చు: రూ. 2 వేలు- రూ. 2500
సింగపూర్: అనేక సంస్కృతులు, కళలు, రుచికరమైన ఆహారానికి సింగపూర్ ప్రసిద్ది. తక్కువ ఖర్చుతో మీరు సింగపూర్ వెళ్లొచ్చు. లయన్ సిటీ అని పిలవబడే సింగపూర్లో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ అందమైన ద్వీపాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. విమాన ఛార్జీలు: రూ. 17-22 వేలు ఒక్క రోజు ఖర్చు: రూ. 6-7 వేలు
యూఏఈ: ఇది ఇండియన్స్కు ఎంతో ఇష్టమైన పర్యాటక ప్రదేశం అని చెప్పాలి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో డైవింగ్, ఎడారిలో క్యాంపింగ్, షాపింగ్ మొదలైన వాటిని భారతీయులు ఇష్టపడతారు. ఈ దేశ రాజధాని దుబాయ్పై ఇండియన్స్కు మక్కువ ఎక్కువ. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఉంది. ఇక అబుదాబీలోని మసీదులు, ఇతర భవనాలు చూడటానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. విమాన ఛార్జీలు: రూ. 14-18 వేలు. అనేక యూఏఈ విమానయాన సంస్థలు.. భారత్కు చౌకైన టికెట్ రేట్లను అందిస్తున్నాయి. ఒక్క రోజు ఖర్చు: రూ. 5-6 వేలు
వియత్నాం: ఇక్కడి సాంప్రదాయ వంటకాలు, సంస్కృతి, నదులతో కూడిన అందమైన ప్రదేశాలు అనేకం. యుద్ద మ్యూజియం, ఫ్రెంచ్ వలసరాజ్యాల నిర్మాణం వంటివి ప్రసిద్ధి. విమాన ఛార్జీలు: రూ. 25 వేలు నుంచి 30 వేలు ఒక్క రోజు ఖర్చు: రూ. 2500 - 3000
ఫిలిప్పీన్స్: ఈ దేశంలోని అనేక ద్వీపాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. రాత్రిపూట సముద్రపు తీరంలో విడిది చేసేందుకు ఎంతోమంది పర్యాటకులు ఇక్కడి విచ్చేస్తుంటారు. మౌంటెన్ బైకింగ్, జలపాతాలు ఇష్టమైన వారికి ఫిలిప్పీన్స్ బెస్ట్ ఆప్షన్. విమాన ఛార్జీలు: రూ. 24 వేలు ఒక్క రోజు ఖర్చు: రూ. 2500 - రూ. 3 వేలు