E-Passport: కేంద్రం తీసుకురానున్న కొత్త ఈ-పాస్పోర్ట్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా.?
E-Passport: తాజాగా కేంద్ర ఆర్థిక శాకమంత్రి నిర్మలా సీతరామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఈ-పాస్పోర్ట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాస్పోర్ట్ల స్థానంలో కొత్త పాస్పోర్ట్లను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఈ పాస్పోర్ట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా...?
Updated on: Feb 03, 2022 | 6:58 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో పాస్పోర్ట్కు సంబంధించి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. భారత్లో త్వరలోనే ఈ-పాస్పోర్ట్ ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇంతకీ ఈ-పాస్ పోర్ట్ ఏంటి.? వీటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొత్త రకం పాస్పార్ట్లలో ఎంబెడెడ్ చిప్స్ను ఉపయోగించడంతో పాటు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇందులో మైక్రోచిప్లను ఉపయోగిస్తారు. వీటిని ట్యాంపరింగ్, నకిలీవి మార్చడానికి అవకాశం ఉండదు.

ప్రస్తుతం ఇలాంటి ఈ - పాస్ పోర్ట్లో అమెరికా, యూకే, జర్మనీతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి. ఈ కొత్త పాస్పోర్ట్లను నాసిక్లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్లో తయారు చేయనున్నారు.

ఇందులో ఉండే మైక్రోచిప్లో పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి పుట్టిన తేదీ, పేరుతో పాటు అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద సమయం వృథా కాకుండా నిమిషాల్లో స్కాన్ చేసే అవకాశం లభిస్తుంది.

పాస్పోర్ట్లో ఉండే చిప్ను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎవరైనా నకిలీ పాస్పోర్ట్లను తయారు చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతారు.




