Realme Pad X: రియల్మీ నుంచి కొత్త ట్యాబ్.. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..
Realme Pad X: ప్రస్తుతం ట్యాబ్లకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లోకి తాజాగా రియల్మీ ప్యాడ్ ఎక్స్ పేరుతో కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. జులై 26న ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 15, 2022 | 7:36 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్ను విడుదల చేసింది. రియల్మీ ప్యాడ్ ఎక్స్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేసే ఈ ట్యాబ్లో 11 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. ఈ ట్యాబ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో పని చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే రియల్మీ ప్యాడ్ ఎక్స్లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను, సెల్ఫీల కోసం 105 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

డాల్బీ అట్మోస్, హై-రిజల్యూషన్ కూడిన నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్ ప్రత్యేకతలు. ఇందులో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 3340 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే ఇందులో 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చిన ఈ ఫోన్ రూ. 20,000 నుంచి రూ. 25,000 మధ్య ఉంటుందని అంచనా.




