- Telugu News Photo Gallery Technology photos Oppo launching new smartphone Oppo F27 in india, Check here for price and features
Oppo F27: ఒప్పో నుంచి అదిరిపోయే స్మార్ట్ఫోన్.. ఆ ఫీచర్తో వస్తున్న తొలి ఫోన్ ఇదే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. మొన్నటి వరకు ప్రీమియం మార్కెట్న టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్లను తీసుకొచ్చిన ఒప్పో తాజాగా మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒప్పో ఎఫ్27 సిరీస్తో పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 02, 2024 | 4:35 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఎఫ్ 287 సిరీస్ పేరుతో కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఎఫ్27, ఎఫ్ 27ప్రో, ఎఫ్ 27+ ఫోన్లను లాంచ్ చేస్తోంది. అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్ను తీసుకొస్తున్నారు.

ఇక ఒప్పో ఎఫ్27 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఐపీ69 రేటింగ్ ఫర్ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ను అందిస్తున్నారు. ఈ ఫీచర్తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. జూన్ 13వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్తో కూడిన ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు అలాగే ఇందులో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.

8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్తో తీసుకొస్తున్న ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ను అందించనున్నారు. ఇదిలా ఉంటే గత నెలలో చైనా మార్కెట్లోలో తీసుకొచ్చిన..ఒప్పో ఏ3 ప్రో ఫోన్ను రీబ్రాండ్ చేసి భారత్ లో ఒప్పో ఎఫ్27 ప్రో+ ఫోన్గా లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 64 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు




