- Telugu News Photo Gallery Technology photos Itel launching new smart Itel S23+ with curved display check here for features and price details
Itel S23+: రూ. 15వేలలో 3డీ కర్డ్వ్ డిస్ప్లే ఫోన్.. మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్..
కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గముఖం పడుతున్నాయి. అధునాతన ఫీచర్స్తో కూడిన ఫోన్లను సైతం తక్కువ బడ్జెట్లోనే లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐటెల్ మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. ఐటెల్ ఎస్23+ పేరుతో త్వరలోనే లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 22, 2023 | 7:52 AM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకొస్తోంది. ఐటెల్ ఎస్23+ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయనున్నారు. తక్కువ బడ్జెట్లో అధునాతన ఫీచర్స్తో ఈ ఫోన్ను తీసుకురానున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనరాక పోయినప్పటికీ, నెట్టింట లీక్ అయిన సమాచారం ఆధారంగా కొన్ని వివరాలు వైరల్ అవుతున్నాయి.

ఐటెల్ ఎస్23+ ధర భారత మార్కెట్లో రూ. 15,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 6.78 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ 3డీ డిస్ప్లేను అందించనున్నారు. రూ. 15 వేల బడ్జెట్లో కర్వ్డ్ డిస్ప్లేతో ఫోన్ రావడం విశేషంగా చెప్పొచ్చు. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ దీని సొంతం.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 12ఎన్ఎమ్ యూనిఎస్ఓసీ టీ616ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు. డ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 12ఎన్ఎమ్ యూనిఎస్ఓసీ టీ616ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు.





























