AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edupayala Jatara: మేడారం ముగిసింది.. ఇక ఏడుపాయల జాతర మొదలు.. కొంగు బంగారంగా 3 రోజుల మహోత్సవం.!

Edupayala Vanadurga Bhavani Jatara: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం పవిత్ర క్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహాజాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Rajashekher G
|

Updated on: Feb 14, 2026 | 1:06 PM

Share

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారక్క జాతర తర్వాత తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే జాతరల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జాతర. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతి సంవత్సరం  మహాశివరాత్రి సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహాజాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారక్క జాతర తర్వాత తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే జాతరల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జాతర. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహాజాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

1 / 5
మరో మహా జాతరకి సిద్ధం..
తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా భక్తుల దృష్టి ఇప్పుడు ఏడుపాయల వైపు మళ్లింది. మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఈ జాతర రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ఖ్యాతి పొందింది.

మరో మహా జాతరకి సిద్ధం.. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా భక్తుల దృష్టి ఇప్పుడు ఏడుపాయల వైపు మళ్లింది. మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఈ జాతర రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ఖ్యాతి పొందింది.

2 / 5

ఏడుపాయలు ఎక్కడుంది?.. 
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఏడుపాయల వద్ద మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి మధ్యలో వనదుర్గమ్మ ఆలయాన్ని ఆవహిస్తుంది. ఆలయాన్ని దాటి మళ్లీ ఆ నీరు ఒకటై ప్రవహించడం ఈ క్షేత్రానికి ప్రత్యేకత. ఈ అపూర్వ దృశ్యం కారణంగా ఈ ప్రాంతానికి “ఏడుపాయలు” అనే పేరు వచ్చింది.  సహజ వన సౌందర్యం మధ్యలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక పరంగానూ విశేష ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.

ఏడుపాయలు ఎక్కడుంది?.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఏడుపాయల వద్ద మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి మధ్యలో వనదుర్గమ్మ ఆలయాన్ని ఆవహిస్తుంది. ఆలయాన్ని దాటి మళ్లీ ఆ నీరు ఒకటై ప్రవహించడం ఈ క్షేత్రానికి ప్రత్యేకత. ఈ అపూర్వ దృశ్యం కారణంగా ఈ ప్రాంతానికి “ఏడుపాయలు” అనే పేరు వచ్చింది. సహజ వన సౌందర్యం మధ్యలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక పరంగానూ విశేష ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.

3 / 5

ఆలయ విశిష్టత.. పురాణ గాథ..
స్థలపురాణం ప్రకారం మహాభారత కాలంలో పాండవుల వనవాస సమయంలో అర్జునుడు దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేసి ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం దివ్యశక్తి నిలయంగా ప్రసిద్ధి చెందింది. వనదుర్గ అమ్మవారిని నమ్ముకుని మనసారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎంతటి వరద వచ్చినా అమ్మవారి వక్షస్థలం వరకు మాత్రమే నీరు చేరుతుందని స్థానికులు చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని భక్తులు ‘కొంగు బంగారం’గా భావిస్తారు.

ఆలయ విశిష్టత.. పురాణ గాథ.. స్థలపురాణం ప్రకారం మహాభారత కాలంలో పాండవుల వనవాస సమయంలో అర్జునుడు దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేసి ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం దివ్యశక్తి నిలయంగా ప్రసిద్ధి చెందింది. వనదుర్గ అమ్మవారిని నమ్ముకుని మనసారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎంతటి వరద వచ్చినా అమ్మవారి వక్షస్థలం వరకు మాత్రమే నీరు చేరుతుందని స్థానికులు చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని భక్తులు ‘కొంగు బంగారం’గా భావిస్తారు.

4 / 5
ఏడుపాయల మహాజాతరలో... 
మహాశివరాత్రి – తొలి రోజు (ఫిబ్రవరి 15).. భక్తులు మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. బండ్ల ఉత్సవం – రెండో రోజు (ఫిబ్రవరి 16).. జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన బండ్ల ఉత్సవం అత్యంత కోలాహలంగా జరుగుతుంది. పరిసర గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకువచ్చి ఆలయ ప్రదక్షిణ చేస్తారు. రథోత్సవం – మూడో రోజు (ఫిబ్రవరి 17).. రథోత్సవంతో మహాజాతర ఘనంగా ముగుస్తుంది. ఈ జాతరకు సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది ఈ జాతరలో పాల్గొంటారు. మొత్తంగా, సహజసిద్ధ ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఏడుపాయల వనదుర్గ భవాని మహాజాతర తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ అవ్యాజ ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలంటే మీరూ ఒక్కసారిగా వనదుర్గ అమ్మారిని దర్శించుకోండి.

ఏడుపాయల మహాజాతరలో... మహాశివరాత్రి – తొలి రోజు (ఫిబ్రవరి 15).. భక్తులు మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. బండ్ల ఉత్సవం – రెండో రోజు (ఫిబ్రవరి 16).. జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన బండ్ల ఉత్సవం అత్యంత కోలాహలంగా జరుగుతుంది. పరిసర గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకువచ్చి ఆలయ ప్రదక్షిణ చేస్తారు. రథోత్సవం – మూడో రోజు (ఫిబ్రవరి 17).. రథోత్సవంతో మహాజాతర ఘనంగా ముగుస్తుంది. ఈ జాతరకు సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది ఈ జాతరలో పాల్గొంటారు. మొత్తంగా, సహజసిద్ధ ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఏడుపాయల వనదుర్గ భవాని మహాజాతర తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ అవ్యాజ ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలంటే మీరూ ఒక్కసారిగా వనదుర్గ అమ్మారిని దర్శించుకోండి.

5 / 5
Follow Us