ఏడుపాయల మహాజాతరలో...
మహాశివరాత్రి – తొలి రోజు (ఫిబ్రవరి 15).. భక్తులు మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. బండ్ల ఉత్సవం – రెండో రోజు (ఫిబ్రవరి 16).. జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన బండ్ల ఉత్సవం అత్యంత కోలాహలంగా జరుగుతుంది. పరిసర గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకువచ్చి ఆలయ ప్రదక్షిణ చేస్తారు. రథోత్సవం – మూడో రోజు (ఫిబ్రవరి 17).. రథోత్సవంతో మహాజాతర ఘనంగా ముగుస్తుంది. ఈ జాతరకు సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిమంది ఈ జాతరలో పాల్గొంటారు. మొత్తంగా, సహజసిద్ధ ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఏడుపాయల వనదుర్గ భవాని మహాజాతర తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ అవ్యాజ ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలంటే మీరూ ఒక్కసారిగా వనదుర్గ అమ్మారిని దర్శించుకోండి.