Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఆలయంలో వింత సాంప్రదాయం.. ప్రసాదాన్ని నేలపై ఉంచి తినే భక్తులు.. కిటికీ వైపు కృష్ణుడు తల.. ఎందుకంటే..

భారతదేశంలో అడుగడుగునా గుడి ఉంది. అత్యంత పురాతన క్షేత్రాలు, మర్మలకు నిలయమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించిన పౌరాణిక కథలు చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అటువంటి దేవాలయాలలోని కొన్ని రహస్యాలను నేటి ఆధునిక సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది. అంతేకాదు అనేక ఆలయాలలోని అనుసరించే సంప్రదాయం కూడా బిన్నంగా ఉంటాయి. ఆ ఆలయాలపై ఉన్న నమ్మకం, సంప్రదాయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచాయి. మన దేశంలోని ఒక ఆలయంలో భగవంతుడి ప్రసాదాన్ని పాత్రలు, ఆకుల వంటి వాటి మీద కాకుండా నేలపై పెట్టి తింటారు. ఆ ఆలయం ఎక్కడంటే

Surya Kala

|

Updated on: Jun 10, 2025 | 3:53 PM

భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని దేవాలయాలు వాటి అద్భుతాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, మరికొన్ని ఆలయాలు వాటి ప్రత్యేకమైన సంప్రదాయాలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వింత సంప్రదాయం ఉన్న ఆలయం ఒకటి కర్నాటకలో ఉంది. ఈ ఆలయంలో అనుసరించే ప్రత్యేకమైన సంప్రదాయం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు.. ఎందుకు ఇలా అని  మనస్సులో అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే ఈ ఆలయంలో భక్తులకు ప్రసాదాన్ని పంచి పెట్టే విధానం వెరీవెరీ స్పెషల్.

భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని దేవాలయాలు వాటి అద్భుతాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, మరికొన్ని ఆలయాలు వాటి ప్రత్యేకమైన సంప్రదాయాలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వింత సంప్రదాయం ఉన్న ఆలయం ఒకటి కర్నాటకలో ఉంది. ఈ ఆలయంలో అనుసరించే ప్రత్యేకమైన సంప్రదాయం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు.. ఎందుకు ఇలా అని మనస్సులో అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే ఈ ఆలయంలో భక్తులకు ప్రసాదాన్ని పంచి పెట్టే విధానం వెరీవెరీ స్పెషల్.

1 / 5
ఈ పురాతన ఆలయం దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉడిపిలో ఉంది. ఈ ప్రదేశాన్ని దేవాలయాల భూమి లేదా పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని ఉడిపి కృష్ణ ఆలయం అని పిలుస్తారు. ఉడిపి శ్రీ కృష్ణ ఆలయ చరిత్ర సుమారు 1000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని 13వ శతాబ్దంలో వైష్ణవ సాధువు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారని స్థానికులు చెబుతారు.

ఈ పురాతన ఆలయం దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉడిపిలో ఉంది. ఈ ప్రదేశాన్ని దేవాలయాల భూమి లేదా పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని ఉడిపి కృష్ణ ఆలయం అని పిలుస్తారు. ఉడిపి శ్రీ కృష్ణ ఆలయ చరిత్ర సుమారు 1000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని 13వ శతాబ్దంలో వైష్ణవ సాధువు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారని స్థానికులు చెబుతారు.

2 / 5
ఉడిపి కృష్ణుడి ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ ఆలయంలో భక్తులు స్వయంగా ప్రసాదాన్ని నేలపైనే వడ్డించమని అడుగుతారు. కోరికలు నెరవేరిన భక్తులందరూ ప్రసాదాన్ని నేలపైనే వడ్డించమని అడుగుతారు. ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తారు. శ్రీ కృష్ణుడి ఈ ప్రసాదాన్ని ప్రసాదం లేదా నైవేద్యం అంటారు. దీనితో పాటు, ప్రసాదాన్ని అరటి ఆకులు, పాత్రలలో మాత్రమే ఇతర భక్తులకు వడ్డిస్తారు. ఈ ఆలయం నేల నల్ల కడప రాయితో తయారు చేయబడింది.

ఉడిపి కృష్ణుడి ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ ఆలయంలో భక్తులు స్వయంగా ప్రసాదాన్ని నేలపైనే వడ్డించమని అడుగుతారు. కోరికలు నెరవేరిన భక్తులందరూ ప్రసాదాన్ని నేలపైనే వడ్డించమని అడుగుతారు. ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తారు. శ్రీ కృష్ణుడి ఈ ప్రసాదాన్ని ప్రసాదం లేదా నైవేద్యం అంటారు. దీనితో పాటు, ప్రసాదాన్ని అరటి ఆకులు, పాత్రలలో మాత్రమే ఇతర భక్తులకు వడ్డిస్తారు. ఈ ఆలయం నేల నల్ల కడప రాయితో తయారు చేయబడింది.

3 / 5
ఉడిపి శ్రీ కృష్ణ ఆలయానికి మాత్రమే చెందిన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలో కొలువైన బాల కృష్ణుడిని భక్తులు నేరుగా దర్శనం చేసుకోరు. ఈ ఆలయంలో తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా శ్రీ కృష్ణుడిని దర్శించుకుని పూజిస్తారు. కిటికీలోని ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలతో అనుసంధానించబడి ఉన్నాయని చెబుతారు. ఈ కిటికీ ద్వారా శ్రీ కృష్ణుడిని పూజించిన తర్వాత ప్రజలు సంతృప్తి , ఆనందం ,  శ్రేయస్సు పొందుతారని కూడా నమ్మకం.

ఉడిపి శ్రీ కృష్ణ ఆలయానికి మాత్రమే చెందిన మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలో కొలువైన బాల కృష్ణుడిని భక్తులు నేరుగా దర్శనం చేసుకోరు. ఈ ఆలయంలో తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా శ్రీ కృష్ణుడిని దర్శించుకుని పూజిస్తారు. కిటికీలోని ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలతో అనుసంధానించబడి ఉన్నాయని చెబుతారు. ఈ కిటికీ ద్వారా శ్రీ కృష్ణుడిని పూజించిన తర్వాత ప్రజలు సంతృప్తి , ఆనందం , శ్రేయస్సు పొందుతారని కూడా నమ్మకం.

4 / 5
ఉడిపి శ్రీ కృష్ణ ఆలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ఉంది. దాని ప్రకారం ఒకప్పుడు శ్రీ కృష్ణుడికి కనక దాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అయితే ఆ భక్తుడిని ఈ ఆలయంలోకి అనుమతించలేదు. తరువాత అతను ఈ ఆలయం వెనుకకు వెళ్లి శ్రీ కృష్ణుడిని ప్రార్థిస్తూ..  తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు, అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ భక్తుడికి తన దర్శనం ఇచ్చాడు. ఇది మాత్రమే కాదు, ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన విగ్రహం  తలను తన ప్రియమైన భక్తుడు కూర్చుని తపస్సు చేస్తున్న వైపుకు తిప్పాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన విగ్రహం తల గోడ వైపు ఉంది. దీంతో  బాల కృష్ణుడి దర్శనం కోసం ఒక కిటికీ తయారు చేయబడింది. ఈ కిటికీ ద్వారానే శ్రీ కృష్ణుడు భక్తులకు దర్శనం ఇస్తాడు.

ఉడిపి శ్రీ కృష్ణ ఆలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ఉంది. దాని ప్రకారం ఒకప్పుడు శ్రీ కృష్ణుడికి కనక దాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అయితే ఆ భక్తుడిని ఈ ఆలయంలోకి అనుమతించలేదు. తరువాత అతను ఈ ఆలయం వెనుకకు వెళ్లి శ్రీ కృష్ణుడిని ప్రార్థిస్తూ.. తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు, అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ భక్తుడికి తన దర్శనం ఇచ్చాడు. ఇది మాత్రమే కాదు, ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన విగ్రహం తలను తన ప్రియమైన భక్తుడు కూర్చుని తపస్సు చేస్తున్న వైపుకు తిప్పాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన విగ్రహం తల గోడ వైపు ఉంది. దీంతో బాల కృష్ణుడి దర్శనం కోసం ఒక కిటికీ తయారు చేయబడింది. ఈ కిటికీ ద్వారానే శ్రీ కృష్ణుడు భక్తులకు దర్శనం ఇస్తాడు.

5 / 5
Follow us
ఇదెక్కడి రనౌట్ భయ్యా.. వీడియో చూస్తే నవ్వుల్లో మునిగిపోవాల్సిందే
ఇదెక్కడి రనౌట్ భయ్యా.. వీడియో చూస్తే నవ్వుల్లో మునిగిపోవాల్సిందే
తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!