Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ సముద్ర జలాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విన్యాసాలు..!Rahul Gandhi Enjoying In See

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ 'సాహస' కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు.

Anil kumar poka

|

Updated on: Feb 25, 2021 | 2:14 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ ‘సాహస’ కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ ‘సాహస’ కార్యం చేశారు. రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశం యావత్తూ కళ్లప్పగించి చూసే పని లోకి దిగారు.

1 / 9
కేరళ పర్యటనలో ఉన్న ఆయన.. కొల్లం జిల్లాలోని తంగసెరి బీచ్ ను సందర్శించారు. ఆ సందర్భంగా మత్స్య కారులు తమ బోట్లలో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడాన్ని చూసిన ఆయన.. తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. తను కూడా ఓ బోటునెక్కి సముద్రం లోకి దూకారు.

కేరళ పర్యటనలో ఉన్న ఆయన.. కొల్లం జిల్లాలోని తంగసెరి బీచ్ ను సందర్శించారు. ఆ సందర్భంగా మత్స్య కారులు తమ బోట్లలో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడాన్ని చూసిన ఆయన.. తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. తను కూడా ఓ బోటునెక్కి సముద్రం లోకి దూకారు.

2 / 9
సుమారు 10 నిముషాలసేపు ఆయన ఈత కొడుతుంటే ..అప్పటివరకు ఆయనకు ఈత వస్తుందని తెలియనివాళ్లంతా తమ కళ్ళ ముందు జరుగుతున్నది చూసి నోళ్లు వెళ్ళబెట్టారు.

సుమారు 10 నిముషాలసేపు ఆయన ఈత కొడుతుంటే ..అప్పటివరకు ఆయనకు ఈత వస్తుందని తెలియనివాళ్లంతా తమ కళ్ళ ముందు జరుగుతున్నది చూసి నోళ్లు వెళ్ళబెట్టారు.

3 / 9
రాహుల్ మత్స్యకారులతో  సుమారు రెండున్నర గంటలు గడిపారు. వారు తయారు చేసిన ఫిష్ కర్రీని బోటులో వారితో కలిసి ఆరగించారు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయన.. వీరి సమస్యలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తానని హామీ ఇచ్చ్చారు.

రాహుల్ మత్స్యకారులతో సుమారు రెండున్నర గంటలు గడిపారు. వారు తయారు చేసిన ఫిష్ కర్రీని బోటులో వారితో కలిసి ఆరగించారు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయన.. వీరి సమస్యలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తానని హామీ ఇచ్చ్చారు.

4 / 9
ఇప్పటికే కేరళ సహా నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకు ప్రచారాల కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు నానాపాట్లూ పడుతోంది.

ఇప్పటికే కేరళ సహా నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకు ప్రచారాల కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు నానాపాట్లూ పడుతోంది.

5 / 9
రైతుల మాదిరే వీరు కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్నదాతలు భూమిపై వ్యవసాయం చేస్తే మత్స్య కారులు సముద్రంలో ఈ ‘వ్యవసాయం’ చేస్తున్నారని ఆయన అన్నారు.

రైతుల మాదిరే వీరు కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్నదాతలు భూమిపై వ్యవసాయం చేస్తే మత్స్య కారులు సముద్రంలో ఈ ‘వ్యవసాయం’ చేస్తున్నారని ఆయన అన్నారు.

6 / 9
ఇప్పటివరకు రైతుల డిమాండ్లను తమ ఎన్నికల ‘ప్రచారాస్త్రం’గా వినియోగించుకోజూస్తున్న వందేళ్లకు పైగా చరిత్ర గల ఈ పార్టీ ఇప్పుడు మత్స్య కారుల సమస్యలపై దృష్టి పెట్టింది. ఇన్నాళ్లూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్న సందర్భాల్లో ఈ వర్గం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటు వచ్చింది.

ఇప్పటివరకు రైతుల డిమాండ్లను తమ ఎన్నికల ‘ప్రచారాస్త్రం’గా వినియోగించుకోజూస్తున్న వందేళ్లకు పైగా చరిత్ర గల ఈ పార్టీ ఇప్పుడు మత్స్య కారుల సమస్యలపై దృష్టి పెట్టింది. ఇన్నాళ్లూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్న సందర్భాల్లో ఈ వర్గం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటు వచ్చింది.

7 / 9
 రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే  రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశ పర్యటనలో  రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ సాహసం చేశారు.

రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే రాజకీయాల్లో సదా బిజీగా ఉంటూనే కాస్త తీరిక చేసుకుని దేశ పర్యటనలో రాహుల్ గాంధీ ఎన్నడూ చేయని ఓ సాహసం చేశారు.

8 / 9
సముద్ర జలాలలో వారితో కలిసి ఈత కొట్టడం చూస్తే ఇది కూడా రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఈ ఎత్తుగడను బీజేపీ నేతలు ఎలా తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటారో చూడాల్సి ఉంది.

సముద్ర జలాలలో వారితో కలిసి ఈత కొట్టడం చూస్తే ఇది కూడా రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఈ ఎత్తుగడను బీజేపీ నేతలు ఎలా తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటారో చూడాల్సి ఉంది.

9 / 9
Follow us