AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విగ్రహం లేని ఆలయం.. కళ్లను మాత్రమే పూజించే భక్తులు..! ఈ శక్తి పీఠం వెనుక దైవ రహస్యం తెలిస్తే..

భారతదేశంలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలలో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నైనిటాల్‌లోని నైనా దేవి ఆలయం అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. నైనీ సరస్సు (Naini Lake) ఉత్తర తీరాన ఉన్న ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, వేల ఏళ్ల చరిత్రకు, అద్భుతమైన పురాణగాథలకు నిలయం. ఈ క్షేత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: May 14, 2026 | 12:53 PM

Share
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో నైనీ సరస్సు ఒడ్డున వెలసిన నైనా దేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద విశేషం ఏమిటంటే, ఇక్కడ దేవతకు పూర్తి విగ్రహం ఉండదు. కేవలం అమ్మవారి నేత్రాలను (కళ్లను) మాత్రమే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం, సతీదేవి నేత్రం ఇక్కడ పడటం వల్ల ఈ ప్రాంతానికి 'నైనిటాల్' అనే పేరు వచ్చింది.

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో నైనీ సరస్సు ఒడ్డున వెలసిన నైనా దేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద విశేషం ఏమిటంటే, ఇక్కడ దేవతకు పూర్తి విగ్రహం ఉండదు. కేవలం అమ్మవారి నేత్రాలను (కళ్లను) మాత్రమే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం, సతీదేవి నేత్రం ఇక్కడ పడటం వల్ల ఈ ప్రాంతానికి 'నైనిటాల్' అనే పేరు వచ్చింది.

1 / 6
శక్తి పీఠం పురాణ గాథ: హిందూ పురాణాల ప్రకారం, దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్నికి ఆహుతి అయిన తర్వాత, పరమశివుడు ఆమె పార్థివ దేహాన్ని భుజంపై వేసుకుని తాండవం చేస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు 51 చోట్ల పడతాయి. సతీదేవి ఎడమ కన్ను (నైన్) ఈ ప్రదేశంలో పడిందని, అందుకే దీనిని నైనా దేవి శక్తి పీఠం అని పిలుస్తారని చరిత్ర చెబుతోంది. ఆ నేత్రం పడటం వల్ల ఏర్పడిన గుంటలోనే నేటి నైనీ సరస్సు ఉద్భవించిందని స్థానికులు నమ్ముతారు.

శక్తి పీఠం పురాణ గాథ: హిందూ పురాణాల ప్రకారం, దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్నికి ఆహుతి అయిన తర్వాత, పరమశివుడు ఆమె పార్థివ దేహాన్ని భుజంపై వేసుకుని తాండవం చేస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు 51 చోట్ల పడతాయి. సతీదేవి ఎడమ కన్ను (నైన్) ఈ ప్రదేశంలో పడిందని, అందుకే దీనిని నైనా దేవి శక్తి పీఠం అని పిలుస్తారని చరిత్ర చెబుతోంది. ఆ నేత్రం పడటం వల్ల ఏర్పడిన గుంటలోనే నేటి నైనీ సరస్సు ఉద్భవించిందని స్థానికులు నమ్ముతారు.

2 / 6
విగ్రహం లేని పూజ: సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా మూర్తుల పూర్తి విగ్రహాలు ఉంటాయి. కానీ నైనా దేవి ఆలయంలో అమ్మవారి పూర్తి విగ్రహం కనిపించదు. గర్భాలయంలో పక్కపక్కనే ఉన్న రెండు నేత్రాలను (కళ్లను) మాత్రమే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా అమ్మవారి నేత్రాలకే పూజలు నిర్వహిస్తారు. నైనా దేవితో పాటు గణేశుడు మరియు కాళీ మాత విగ్రహాలు కూడా ఈ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నాయి.

విగ్రహం లేని పూజ: సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా మూర్తుల పూర్తి విగ్రహాలు ఉంటాయి. కానీ నైనా దేవి ఆలయంలో అమ్మవారి పూర్తి విగ్రహం కనిపించదు. గర్భాలయంలో పక్కపక్కనే ఉన్న రెండు నేత్రాలను (కళ్లను) మాత్రమే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా అమ్మవారి నేత్రాలకే పూజలు నిర్వహిస్తారు. నైనా దేవితో పాటు గణేశుడు మరియు కాళీ మాత విగ్రహాలు కూడా ఈ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నాయి.

3 / 6
చారిత్రక ప్రాముఖ్యత: 1842లో మోతీరామ్ షా అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే, 1880లో సంభవించిన భారీ భూకంపం, భూపాతాల వల్ల పాత ఆలయం నాశనమైంది. ఆ తర్వాత 1883లో స్థానికులు తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించారు. నేటికీ ఇక్కడి భవన నిర్మాణం, పరిసరాలు నాటి నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబిస్తాయి.

చారిత్రక ప్రాముఖ్యత: 1842లో మోతీరామ్ షా అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే, 1880లో సంభవించిన భారీ భూకంపం, భూపాతాల వల్ల పాత ఆలయం నాశనమైంది. ఆ తర్వాత 1883లో స్థానికులు తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించారు. నేటికీ ఇక్కడి భవన నిర్మాణం, పరిసరాలు నాటి నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబిస్తాయి.

4 / 6
హిమాలయాల ఒడిలో, ప్రకృతి సౌందర్యం మధ్య కొలువుదీరిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రం పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది.

హిమాలయాల ఒడిలో, ప్రకృతి సౌందర్యం మధ్య కొలువుదీరిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రం పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది.

5 / 6
దర్శన విశేషాలు: నైనా దేవిని దర్శించుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని, జ్ఞానోదయం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా నందాష్టమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. చుట్టూ ఎత్తైన కొండలు, ఎదురుగా ప్రశాంతమైన సరస్సు.. ఈ ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది.

దర్శన విశేషాలు: నైనా దేవిని దర్శించుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని, జ్ఞానోదయం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా నందాష్టమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. చుట్టూ ఎత్తైన కొండలు, ఎదురుగా ప్రశాంతమైన సరస్సు.. ఈ ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది.

6 / 6
Follow Us