Dussehra 2022: తెలుసా? మన దేశంలోని ఈ ప్రాంతాల్లో రావణదహనం మహాపాపమట! పైగా నిత్యం పూజలు కూడా..
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు అంతరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐతే ఈ దశమి నాడు రావణ దహనం చేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఐతే మన దేశంలోని కొన్ని ప్రదేశాల్లో రావణ దహనం అస్సలు చేయరు. పైగా ఈ ప్రాంతాల్లో రావణున్ని దైవంగా ..
Updated on: Oct 04, 2022 | 9:23 PM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు అంతరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐతే ఈ దశమి నాడు రావణ దహనం చేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఐతే మన దేశంలోని కొన్ని ప్రదేశాల్లో రావణ దహనం అస్సలు చేయరు. పైగా ఈ ప్రాంతాల్లో రావణున్ని దైవంగా భావించి, పూజలు చేస్తారు. ఎక్కడెక్కడంటే..

రాజస్థాన్లోని జోధ్పూర్ నివాసులు తాము రావణుడి వారసులుగా చెప్పుకుంటారు. జోధ్పూర్లో రావణ దేవాలయం కూడా ఉంది. అక్కడ రావణుడిని నిత్యం పూజిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ ప్రజలు రావణుడిని శక్తి సామ్రాట్గా భావిస్తారు. ఇక్కడ కూడా రావణుడికి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శివునితో పాటు రావణుడిని కూడా పూజిస్తారు.

కర్ణాటకలోని కోలార్లో కూడా రావణున్ని పూజిస్తారు. రావణుడిని గొప్ప శివభక్తుడిగా పూజిస్తారు అక్కడి ప్రజలు.

మధ్యప్రదేశ్లో మందసౌర్.. రావణుడి భార్య తండ్రి అంటే రావణుడి మామ ఊరట. అందుకే అక్కడి ప్రజలు రావణుని గౌరవార్థం విజయ దశమినాడు రావణున్ని దహనం చేయరు. అక్కడ కూడా రావణుడిని దైవంగా పూజిస్తారు.
