పుల్వామా ఘటనకు నాలుగేళ్లు .. 40 మంది జవాన్లను మింగేసిన చీకటి రోజు.. అమరవీరుల స్మృతిలో..
2019 జనవరి 14వ తేదీన పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. జైషేమహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన 40 మంది జవాన్లు అమరులు అయ్యారు.
Updated on: Feb 14, 2023 | 11:57 AM

2019 జనవరి 14వ తేదీన పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. జైషేమహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కు చెందిన 40 మంది జవాన్లు అమరులు అయ్యారు.

సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజున జాతీయ రహదారి 44పై భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని లేత్పోరా సమీపంలోని అవంతిపోరా సమీపంలోని జాతీయ రహదారి 44పై 78 ఆర్మీ వాహనాల్లో 2,500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బారులు తీరారు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నేరుగా ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టాడు. 76వ బెటాలియన్కు చెందిన 40 మంది సైనికులు అక్కడికక్కడే వీరమరణం పొందారు.

ఈ వార్త దేశమంతటా వ్యాపించడంతో ప్రజలు కన్నీటి పర్యాంతమయ్యారు. దేశవ్యాప్తంగా క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఎక్కడ చూసినా ప్రతీకార కేకలు వినపడటం మొదలైంది. ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టిన ఉగ్రవాదిని జైషే మహ్మద్ (జేఈఎం) ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ (20)గా గుర్తించారు.

ఫిబ్రవరి 15, 2019న విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని పాకిస్తాన్ కేంద్రంగా జరిగిందని పేర్కొంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 2019 న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది.

దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ మరుసటి రోజు వైమానిక దాడులు చేసింది. ఈ సమయంలో MIG-21 ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ PAF యొక్క F-16 ను కూల్చివేశాడు. అభినందన్ వర్థమాన్ చూపిన ధైర్య సాహసాలకు గాను దేశంలోని మూడో అత్యున్నత శౌర్య పురస్కారం వీర్ చక్రను ప్రదానం చేశారు.





























