AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal: 10 సిక్సర్లు, 14 ఫోర్లు.. డబుల్ సెంచరీతో ఇంగ్లండ్‌కే కాదు, రికార్డులకే దడ పుట్టించిన ముంబైకర్..

Yashasvi Jaiswal Dounle Century: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ వరుసగా డబుల్ సెంచరీలు సాధించాడు. 2వ టెస్టు మ్యాచ్‌లో 209 పరుగులు చేసిన జైస్వాల్.. రాజ్ కోట్ టెస్టు మ్యాచ్ లో డబుల్ సెంచరీ(214 నాటౌట్) చేసి సంచలనం సృష్టించాడు.

Venkata Chari
|

Updated on: Feb 18, 2024 | 1:45 PM

Share
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3వ టెస్టులో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన జైస్వాల్ 3వ రోజు 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3వ టెస్టులో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన జైస్వాల్ 3వ రోజు 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

1 / 5
నాలుగో రోజు 104 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగించి విజయవంతమైన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాడు. ఫలితంగా మైదానం నలుమూలల నుంచి సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ ఒక్క ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్ కొట్టి దడ పుట్టించాడు.

నాలుగో రోజు 104 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగించి విజయవంతమైన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాడు. ఫలితంగా మైదానం నలుమూలల నుంచి సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ ఒక్క ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్ కొట్టి దడ పుట్టించాడు.

2 / 5
ఈ తుఫాన్ బ్యాటింగ్ తో ఇంగ్లండ్ బౌలర్లను మట్టికరిపించిన యశస్వి జైస్వాల్ కేవలం 231 బంతుల్లోనే 10 సిక్సర్లు, 14 ఫోర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా ఇంగ్లండ్‌పై వరుసగా డబుల్ సెంచరీలు సాధించి ప్రత్యేక ఫీట్ సాధించాడు.

ఈ తుఫాన్ బ్యాటింగ్ తో ఇంగ్లండ్ బౌలర్లను మట్టికరిపించిన యశస్వి జైస్వాల్ కేవలం 231 బంతుల్లోనే 10 సిక్సర్లు, 14 ఫోర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా ఇంగ్లండ్‌పై వరుసగా డబుల్ సెంచరీలు సాధించి ప్రత్యేక ఫీట్ సాధించాడు.

3 / 5
దీనికి ముందు విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 209 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ డబుల్ సెంచరీ సాధించి యువ స్ట్రైకర్ రికార్డులను తుడిచిపెట్టేశాడు.

దీనికి ముందు విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 209 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ డబుల్ సెంచరీ సాధించి యువ స్ట్రైకర్ రికార్డులను తుడిచిపెట్టేశాడు.

4 / 5
రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌కు 557 పరుగుల విజయలక్ష్యం లభించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 214 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 91 పరుగులు చేశాడు.

రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌కు 557 పరుగుల విజయలక్ష్యం లభించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 430/4 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 214 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 91 పరుగులు చేశాడు.

5 / 5