- Telugu News Photo Gallery Cricket photos Indian Active Players Most Test Centuries Against West Indies
IND vs WI: వెస్టిండీస్పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా క్రికెటర్లు వీరే.. టాప్ ప్లేస్ ఎవరిదో అసలు ఊహించలేరు
డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించాడు. కాగా సెంచరీతో రోహిత్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్పై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో యాక్టివ్ టీమిండియా ప్లేయర్గా నిలిచాడు.
Updated on: Jul 17, 2023 | 9:25 PM

డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించాడు. కాగా సెంచరీతో రోహిత్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్పై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో యాక్టివ్ టీమిండియా ప్లేయర్గా నిలిచాడు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ఈ స్టార్ బ్యాటరో కాదు. టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. వెస్టిండీస్పై అత్యధిక సెంచరీలు సాధించిన యాక్టివ్ ప్లేయర్లలో అతనిదే అగ్రస్థానం.

రవిచంద్రన్ అశ్విన్: వెస్టిండీస్పై 12 ఇన్నింగ్స్లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 4 సెంచరీలు చేశాడు. దీంతో ప్రస్తుతం భారత్కు ఆడుతున్న ఆటగాళ్లలో వెస్టిండీస్పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

రోహిత్ శర్మ: వెస్టిండీస్తో జరిగిన 5 టెస్టు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 3 సెంచరీలు సాధించాడు. దీంతో ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ: వెస్టిండీస్తో జరిగిన 20 టెస్టు ఇన్నింగ్స్ల్లో విరాట్ కోహ్లీ కేవలం 2 సెంచరీలు మాత్రమే చేశాడు.

అజింక్య రహానె: వెస్టిండీస్పై మొత్తం 11 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన అజింక్య రహానే 2 సెంచరీలు సాధించాడు.




