ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హవా..జోరు పెంచుతున్న యంగ్ హీరోస్!
ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్ సినిమాల హవా కనిపిస్తోంది. టాలీవుడ్లో ఈ జోరు ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. టాప్ స్టార్స్ పాన్ ఇండియా రేంజ్ మల్టీస్టారర్లు ప్లాన్ చేస్తుంటే... కుర్ర హీరోలు కూడా ఇదే జానర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రీజినల్ రేంజ్లో ఇంట్రస్టింగ్ మల్టీస్టారర్లను లైన్లో పెడుతున్నారు.
Updated on: Feb 01, 2025 | 10:41 AM

సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఒకే సినిమాలో నటిస్తున్నారు. భైరవం పేరుతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్తో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది మూవీ టీమ్.

మ్యాడ్ సీక్వెల్గా తెరకెక్కుతున్న మూవీ మ్యాడ్ స్క్వేర్. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన మ్యాడ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అందుకే ముందు ప్లానింగ్ లేకపోయినా... సీక్వెల్ను లైన్పెట్టిన మేకర్స్, సినిమా మీద అంచనాలు పెంచేశారు. పార్ట్ వన్ టైమ్లో స్టార్ ఇమేజ్ గురించి పెద్దగా డిస్కషన్ జరగకపోయినా... సీక్వెల్ను మాత్రం మల్టీస్టారర్గానే చూస్తున్నారు మూవీ లవర్స్.

అప్ కమింగ్ లిస్ట్లో అంచనాలు పెంచేస్తున్న మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ మిరాయ్. హనుమాన్తో రికార్డులు తిరగరాసిన తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిలిం మిరాయ్

ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీని కూడా యంగ్ మల్టీస్టారర్గానే భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇలా కుర్ర హీరోలు వరుస మల్టీస్టారర్స్ ప్లాన్ చేస్తుండటంతో ఆ సెగ్మెంట్లో వస్తున్న సినిమాల మీద అంచనాలు భారీగా ఉన్నాయి.





























