Keerthy Suresh: టెంప్టింగ్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్
మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
Updated on: Apr 16, 2024 | 1:38 PM

విజయ్ 69వ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తారన్నది టాక్. హెచ్.వినోద్ డైరక్ట్ చేస్తారని, సామ్కి ఆల్రెడీ సిగ్నల్స్ అందాయన్నది కోడంబాక్కం న్యూస్.

కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక తన సొంత భాష మలయాళ 'గీతాంజలి' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ యాక్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి.

తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ 'నేను శైలాజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యింది. తెలుగులో కాస్త గ్యాప్తో పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. ఈ సినిమాలోని నటనకు కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

గతేడాది తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీలో చిరు చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.




