ఎవ్వరి మాట వినని రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు నిజంగా మారిపోయాడా?
రామ్ గోపాల్ వర్మ నిజంగానే మారిపోయారా..? ఇకపై ఆయన నుంచి కేవలం మంచి సినిమాలు మాత్రమే రానున్నాయా..? ఒకప్పట్లా వర్మ మళ్లీ జీనియస్ సబ్జెక్ట్స్తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్సైపోయారా..? తాజాగా ఓ సెన్సేషనల్ ప్యాన్ ఇండియన్ సినిమాకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత..?
Updated on: Feb 05, 2025 | 6:22 PM

మామూలుగా అయితే వర్మఎవ్వరి మాటా వినడు.. నచ్చిందే చేస్తుంటాడు. కానీ నేనలా కాదండీ.. ఇప్పుడు మారానండీ అంటూ ఈ మధ్యే ట్వీటేసారు వర్మ. ఇకపై చూస్తారుగా ఈ RGV ఆడించే ఆట అంటూ రజినీ రేంజ్లో చెప్పిన వర్మ.. ఇప్పుడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు.

కొన్నేళ్లుగా వర్మ నుంచి ఏ సినిమాలు వస్తున్నాయి.. ఆయనేం చేస్తున్నారనే విషయాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా వర్మ పనైపోయిందంటూ ఫిక్సైపోయారు.

తాజాగా ఓ సెన్సేషనల్ కాంబోకి వర్మ రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. విజయ్ సేతుపతి, వెంకటేష్, అమితాబ్ సిండికేట్గా సినిమా చేస్తారని టాక్ వచ్చింది.

గతంలో వెంకీతో క్షణ క్షణం, అమితాబ్తో సర్కార్ సహా చాలా సినిమాలు చేయడంతో నిజమే అనుకున్నారంతా.

కానీ అలాంటిదేం లేదని.. ఈ సిండికేట్ న్యూస్ అంతా కేవలం అబద్ధమే అంటూ కొట్టి పారేసారు వర్మ. న్యూస్ రాగానే నో చెప్పకుండా.. మ్యాటర్ ప్యాన్ ఇండియన్ స్థాయిలో వైరల్ అయ్యాక ఖండించారు వర్మ. అట్లుంటది వర్మతో మరి..!





























