Rajitha Chanti |
Updated on: Feb 27, 2021 | 11:11 AM
రమ్యకృష్ణ... దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్గా కోనసాగుతూనే రజినీ కాంత్, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన నరసింహ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇప్పటికీ నీలాంబరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
సౌందర్య... మన ఇంటి సంప్రదాయపు ఆడపిల్లగా కనిపిస్తూ.. తన చిరునవ్వుతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది సౌందర్య. నంబర్ వన్ హీరోయిన్గా కొన్ని ఏళ్ళు టాలీవుడ్లోని అగ్రహీరోల సరసన నటించిన సౌందర్య.. అదే సమయంలో శ్రీకాంత్ హీరోగా నా మనసిస్తా రా సినిమాలో నెగిటివ్ షెడ్లో అలరించింది. కానీ ఎప్పుడు మంచితనంగా కనిపించే సౌందర్యను ప్రేక్షకులు అలా విలన్ పాత్రలో చూడలేకపోయారు.
త్రిష.. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో చేస్తూ వచ్చిన త్రిష.. క్రమంగా టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ధర్మయోగి సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించింది.
సమంత... చక్కటి చిరునవ్వు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారును కట్టిపడేసింది సమంత. హీరోయిన్గా అలరిస్తూనే.. తమిళ స్టార్ విక్రమ్ హీరోగా వచ్చిన పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో పవర్ ఫుల్ విలన్గా నటించింది.
రాశి.. అందమైన సంప్రదాయపు బుట్టబోమ్మలగా కనిపించే రాశి.. తనలోనూ నెగిటివ్ షేడ్ ఉందని నిరుపించుకుంది. మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపిచంద్ సరసన విలన్ పాత్రలో రాశి నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు.
రీమాసేన్.. గ్లామర్ హీరోయిన్గానే కాకుండా ప్రతినాయిక పాత్రలోనూ మెప్పించింది రీమాసేన్.. కార్తీ యుగానికి ఒక్కడు సినిమాతోపాటు శింబు తెరకెక్కించిన వల్లభ సినిమాల్లో రీమాసేన్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే.
వరలక్ష్మీ శరత్ కుమార్... ప్రస్తుతం కోలివుడ్తోపాటు టాలీవుడ్లో ఫీమేల్ విలన్గా వరలక్ష్మీ శరత్ కుమార్ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి మరోసారి తానేంటో నిరుపించుకుంది వరలక్ష్మీ.