అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
అల్లు అర్జున్, అట్లీ సినిమాపై మొదట్నుంచీ క్లారిటీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువగా ఉంది. ఓసారి నిర్మాతలు మారిపోయారంటారు.. మరోసారి దర్శకుడే మారిపోయారంటారు.. ఇంకోసారి ప్రాజెక్ట్ ఆగిపోయిందంటారు.. ఇలా రోజుకో విధంగా ట్రెండ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్. అసలు అట్లీ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి..? స్టోరీ సిట్టింగ్స్ మొదలయ్యాయా లేదా..? చూద్దామా ఎక్స్క్లూజివ్గా..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 26, 2025 | 7:30 PM

పుష్ప కోసం తెలియకుండానే ఐదేళ్ళిచ్చేసారు అల్లు అర్జున్. అందుకే ఇకపై ఏడాదికి రెండు సినిమాలు ఫిక్సైపోయారీయన.. అలా కుదరకపోతే కనీసం ఒక్కటైనా రిలీజ్ చేస్తానని ఫ్యాన్స్కి మాటిచ్చారు అల్లు అర్జున్.

అలాగని కథ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. అందుకే స్టోరీ సిట్టింగ్స్లోనే తానే కూర్చుంటున్నారు ఐకాన్ స్టార్. త్రివిక్రమ్ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చి.. అట్లీ సినిమాను ముందుకు తీసుకొచ్చారు బన్నీ. ప్రస్తుతం ఈ చిత్ర స్టోరీ సిట్టింగ్స్ దుబాయ్లో జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ కూడా కొన్ని రోజులుగా అక్కడే ఉన్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో 5గురు హీరోయిన్లు ఉంటారని.. జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ అని తెలుస్తుంది.

అల్లు అర్జున్, అట్లీ సినిమా నుంచి సన్ పిక్చర్స్ తప్పుకుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అన్నీకుదిర్తే మే నుంచి ఈ చిత్రం సెట్స్పైకి వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ ఏడాదిలోపే పూర్తి చేయాలని బన్నీ కండీషన్ పెట్టారు. అట్లీ దీనికి ఫిక్సయ్యే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు.

అట్లీ తర్వాత త్రివిక్రమ్తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్కు సిద్ధం కానున్నారు అల్లు అర్జున్. నిజానికి అట్లీ కంటే ముందే ఈ సినిమా మొదలు పెట్టాల్సి ఉన్నా.. ఓ అండర్స్టాండింగ్ ప్రకారమే త్రివిక్రమ్కు టైమ్ ఇచ్చారు అల్లు అర్జున్. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ భారీగా చేయాల్సి ఉంటుంది. అందుకే గురూజీకి కావాల్సినంత టైమిచ్చారు బన్నీ. ఈలోపు అట్లీ సినిమాతో రానున్నారీయన.





























