- Telugu News Photo Gallery Cinema photos A pan India film with three star heroes from three industries
Movie News: ముగ్గురు స్టార్ హీరోలు.. మూడు ఇండస్ట్రీలు.. క్రేజీ కాంబోలో పాన్ ఇండియా చిత్రం..
మూడు భాషల టాప్ స్టార్స్, 400 కోట్ల భారీ బడ్జెట్, సక్సెస్కు కేరాఫ్ అన్న పేరున్న టాప్ ప్రొడ్యూసర్, వరుస హిట్స్తో తనకంటూ సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసుకుంటున్న యంగ్ డైరెక్టర్. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అది కూడా నెవ్వర బిఫోర్ అన్న రేంజ్...? ఇంతకీ ఎంటా సినిమా..? అనుకుంటున్నారా... అయితే ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీద ఓ లుక్కేయండి.
Updated on: Oct 16, 2023 | 9:50 AM

మూడు భాషల టాప్ స్టార్స్, 400 కోట్ల భారీ బడ్జెట్, సక్సెస్కు కేరాఫ్ అన్న పేరున్న టాప్ ప్రొడ్యూసర్, వరుస హిట్స్తో తనకంటూ సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసుకుంటున్న యంగ్ డైరెక్టర్.

ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అది కూడా నెవ్వర బిఫోర్ అన్న రేంజ్...? ఇంతకీ ఎంటా సినిమా..? అనుకుంటున్నారా... అయితే ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీద ఓ లుక్కేయండి.

హిట్ సిరీస్తో అందరి దృష్టినీ ఆకర్షించిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. తొలి సినిమాతోనే బాలీవుడ్ దృష్టిలో కూడా పడిన శైలేష్, తన సినిమాను తానే నార్త్లో రీమేక్ చేశారు. రీసెంట్గా హిట్ 2తో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రజెంట్ సీనియర్ హీరో వెంకటేష్తో సైంధవ్ సినిమాను రూపొందిస్తున్న శైలేష్ త్వరలో ఓ భారీ బడ్జెట్ మూవీకి రెడీ అవుతున్నారు.

క్రైమ్ థ్రిల్లర్లను తెరకెక్కించటంలో ఎక్స్పర్ట్గా పేరు తెచ్చుకున్న శైలేష్ దర్శకత్వంలో 400 కోట్ల బడ్జెట్తో భారీ మూవీని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాత దిల్ రాజు. పాన్ ఇండియా ట్రెండ్కు తగ్గట్టుగా బిగ్ స్టార్ కాస్ట్తో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్.

ప్రజెంట్ దిల్ రాజు బ్యానర్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్తో పాటు తమిళ్ నుంచి సూర్య, హిందీ నుంచి మరో స్టార్ హీరో ఈ కథలో భాగం కాబోతున్నారన్నది ఇండస్ట్రీ టాక్. నిజంగానే ఈ కాంబో సెట్ అయితే మల్టీ స్టారర్ ట్రెండ్ ఇదే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా అవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.




