AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులస చేపల పులుసు.. ఇలా వండితే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!

చేపల కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చేపల కర్రీ వండుకొని తింటారు. అయితే అన్ని చేపల్లో కెళ్లా చాలా మందికి పులస చేపల పులుసు ఇష్టం ఉంటుంది. అయితే పులస చేపల పులు ఈ రంగంగా వండితే రుచి అదిరి పోవడమే కాకుండా ముద్ద ముద్దకు ఆహా.. అంటూ తింటారంట. కాగా ఇది ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 10, 2026 | 12:11 PM

Share
పులస చేపల పులుసుకు కావాల్సిన  పదార్థాలు : చింత పండు, ధనియాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి గడ్డ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, చింత పండు, కొత్తిమీర, ఒక టమాటా.

పులస చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు : చింత పండు, ధనియాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి గడ్డ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, చింత పండు, కొత్తిమీర, ఒక టమాటా.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ఉల్లి గడ్డను అగ్నిలో కాల్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వీటన్నిటినీ రోటిలో కలిపి ముద్దలా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

తయారీ విధానంలోకి వెళితే.. ఉల్లి గడ్డను అగ్నిలో కాల్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వీటన్నిటినీ రోటిలో కలిపి ముద్దలా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు పులస చేపలను తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కొంచెం గోరు వెచ్చగా ఉన్న నీటిలో చేప ముక్కలను వేసి,  ఉప్పు, పసుపు వేసి బాగా కడగాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పులస చేపలను తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కొంచెం గోరు వెచ్చగా ఉన్న నీటిలో చేప ముక్కలను వేసి, ఉప్పు, పసుపు వేసి బాగా కడగాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం పాన్ పెట్టాలి. అందులో నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి.

ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం పాన్ పెట్టాలి. అందులో నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి.

4 / 5
ఇది అంతా బాగా కలిసి వేగిన తర్వాత ఇందులో చింత పండు రసం వేయాలి. కొంచెం నీళ్లు పోసి పులుసు బాగా మరిగేలా చూసుకోవాలి. తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా మెల్లిగా కలిపి, అందులో ధనియాల పొడి, మెంతి పొడి వేసి మరో పది నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ పులస చేపల పులుసు రెడీ.

ఇది అంతా బాగా కలిసి వేగిన తర్వాత ఇందులో చింత పండు రసం వేయాలి. కొంచెం నీళ్లు పోసి పులుసు బాగా మరిగేలా చూసుకోవాలి. తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా మెల్లిగా కలిపి, అందులో ధనియాల పొడి, మెంతి పొడి వేసి మరో పది నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ పులస చేపల పులుసు రెడీ.

5 / 5
Follow Us