Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himalayas: భారతదేశాన్ని భయపెడుతున్న హిమాలయాలు.. అర లక్షకు పైగా గ్లేసియర్లతో ముప్పు!

హిమాలయాలు. లక్షల ఏళ్ల క్రితం మొదలైన ఒక మహా నిర్మాణం. ఈ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ నిర్మాణం జరుగుతోంది కాబట్టే ఏడాదికో సెంటీమీటర్ పెరుగుతూ పోతోంది. దీంతో పాటే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హిమాలయాలు పెరుగుతుంటే ప్రమాదం లేదు గానీ..

Himalayas: భారతదేశాన్ని భయపెడుతున్న హిమాలయాలు.. అర లక్షకు పైగా గ్లేసియర్లతో ముప్పు!
Himalayas
Follow us
Gunneswara Rao

| Edited By: TV9 Telugu

Updated on: Jul 03, 2024 | 10:51 AM

హిమాలయాలు. లక్షల ఏళ్ల క్రితం మొదలైన ఒక మహా నిర్మాణం. ఈ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ నిర్మాణం జరుగుతోంది కాబట్టే ఏడాదికో సెంటీమీటర్ పెరుగుతూ పోతోంది. దీంతో పాటే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హిమాలయాలు పెరుగుతుంటే ప్రమాదం లేదు గానీ.. అక్కడున్న మంచు కరిగితేనే యమ డేంజర్. ఆ ప్రమాదం వెనకున్న ముప్పును అంచనా వేయడం కూడా కష్టమే. 2100 నాటికి హిమాలయాలపై 75 శాతం మంచు కరిగిపోతుందని అంచనా Himalayas 1 మరో 75 ఏళ్లలో.. అంటే 2100 సంవత్సరం నాటికి హిమాలయాలపై ఉన్న మంచు 75 శాతం కరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. భారీ జల ప్రళయమే వస్తుంది. ఆ మంచు కాస్తా పూర్తిగా కరిగిపోతే.. అప్పుడిక జలప్రళయాలు కాదు.. నదులే ఉనికి కోల్పోతాయి. గంగ, యమున, బ్రహ్మపుత్ర, సింధు నదులు భారతదేశంలోని 40 శాతం మందికి నీటిని అందిస్తున్నాయి. ఈ నదుల నీరే.. తాగునీటి అవసరాలకు, పంటలు పండించడానికి, పరిశ్రమలకు ఉపయోగపడుతున్నాయి. సో, హిమాలయాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ఉత్తర భారతదేశమే ఉండదు. అంతకంటే ముందు మరో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మంచు కరుగుతున్న కారణంగా సముద్రమట్టాలు కూడా పెరుగుతాయి. ఇవి దేశంలోని తీరప్రాంతాలను సముద్రంలో కలిపేసుకునే ప్రమాదముంది. 2000 – 2020 మధ్య కరిగిపోయిన మంచు దాదాపు 2 లక్షల కోట్ల కిలోలు! Himalayas 2 హిమాలయాలు కరుగుతున్నాయంటే.. మిగిలిన చోట్ల కూడా అదే...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి