NZ Vs IND: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, ‌కోహ్లీలు దూరం.!

NZ Vs IND: ఈ నెల 12 నుంచి స్వదేశంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. తీరికలేని షెడ్యూల్, ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా రోహిత్ శర్మ ఇప్పుడిప్పుడే కాలిపిక్క గాయం నుంచి కోలుకుంటుండటంతో ఈ సిరీస్‌‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్, […]

NZ Vs IND: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీ సిరీస్‌కు రోహిత్, ‌కోహ్లీలు దూరం.!
Follow us

|

Updated on: Mar 02, 2020 | 3:19 PM

NZ Vs IND: ఈ నెల 12 నుంచి స్వదేశంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. తీరికలేని షెడ్యూల్, ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా రోహిత్ శర్మ ఇప్పుడిప్పుడే కాలిపిక్క గాయం నుంచి కోలుకుంటుండటంతో ఈ సిరీస్‌‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలోనే సఫారీలతో ఆడనున్న వన్డేలకు ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలన్న దానిపై సెలెక్టర్లు డైలమాలో పడ్డారట.

ఇప్పటికే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకుని రీ-ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. ఇక కెప్టెన్సీ రేసులో కూడా గబ్బరే ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత టీ20 స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌లు నిలిచారు. వీళ్ళ ముగ్గురిలో ఒకరు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారట. అటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఈ సిరీస్‌తోనే కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడు. కాగా, రాహుల్, అయ్యర్‌లు ఐపీఎల్‌లో తమ ఫ్రాంచైజీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విషయం విదితమే. కాగా, కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా భారత్‌కు పరాభవం తప్పలేదు.

For More News:

మంత్రి పువ్వాడకు చేదు అనుభవం…

కరోనా బాధితుడు హతం.. కిమ్ మరో దుశ్చర్య.!

టెస్ట్ సిరీస్ వైట్‌వాష్.. కివీస్‌కు తిరుగులేని విజయం…

సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన కేటీఆర్.. రూ.లక్ష జరిమానా.!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈజీగా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.!

మతమేదైనా.. గుడిలో అర్చకుడికి పింఛన్ ఇచ్చిన ముస్లిం.!

మైండ్ దొబ్బిందా.? జర్నలిస్టుపై కోహ్లీ ఫైర్.!