ఇండిగోలో కంగనా ప్రయాణం. మీడియా అత్యుత్సాహం, డీజీసీఏ ఆగ్రహం
ఇటీవల చండీ గఢ్ నుంచి ముంబైకి కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు సేఫ్టీ రూల్స్ , భౌతిక దూరం వంటివాటిని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్...
ఇటీవల చండీ గఢ్ నుంచి ముంబైకి కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు సేఫ్టీ రూల్స్ , భౌతిక దూరం వంటివాటిని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) మండిపడింది. ఇండిగో ఎయిర్ లైన్స్ సీఈఓ కి తీవ్ర పదజాలంతో లేఖను రాస్తూ.. నాడు అలా రూల్స్ ని అతిక్రమించినవారిపై ఎలాంటి చర్య తీసుకున్నారో 15 రోజుల్లోగా రిపోర్టు సమర్పించాలని, లేని పక్షంలో కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై ఏ దేశీయ ఎయిర్ లైన్స్ లో నైనా ఇలా జరిగితే రెండు వారాలపాటు వాటి సర్వీసును నిలిపివేస్తామని కూడా పేర్కొంది. విమానాల్లో ఫోటోలు తీయడం ఎయిర్ క్రాఫ్ట్ రూల్-13 ప్రకారం నిషిధ్ధమని అధికారులు స్పష్టం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించకపోవడం వంటివాటిని అనుమతించే ప్రసక్తే లేదని వారు తెలిపారు. ఈ నెల 9 న కంగనా ప్రయాణించిన ఇండిగో విమానంలో ఆమె వెంట ఉన్న మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు తోసుకుంటూ ఆమె కూర్చున్న సీటు వద్దకు రావడాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఈ విధమైన ఘటనలో దేశీయ విమాన సర్వీసుల్లో ఎప్పుడు జరిగినా రెండు వారాలపాటు సంబంధిత సర్వీసును నిలిపివేయడం ఖాయమని వార్ణింగ్ ఇచ్చింది.
— DGCA (@DGCAIndia) September 12, 2020