మంత్రి సన్నిహితురాలి ఫ్లాట్‌లో నోట్ల కట్టల గుట్ట.. ఎంత మంది, ఎన్ని గంటలు లెక్కించారంటే..?

బెంగాల్‌లో వెలుగుచూసిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీపై వేటు పడింది. పార్థ ఛటర్జీని కేబినెట్‌ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొలగించారు.

మంత్రి సన్నిహితురాలి ఫ్లాట్‌లో నోట్ల కట్టల గుట్ట.. ఎంత మంది, ఎన్ని గంటలు లెక్కించారంటే..?
Arpita Mukherjee
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 28, 2022 | 6:00 PM

బెంగాల్‌లో వెలుగుచూసిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee)పై వేటు పడింది. పార్థ ఛటర్జీని కేబినెట్‌ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొలగించారు. పార్థ ఛటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) ఇళ్లలో ఈ స్కాంకు సంబంధించి దాదాపు రూ.50 కోట్ల నగదు ఈడీ దాడుల్లో బయటపడ్డాయి. ఈ డబ్బుతో పాటు 5 కిలోల బంగారు ఆభరణాలను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అరెస్టయిన పార్థా ఛటర్జీ సన్నిహితురాలు రెండో ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది.

నాలుగు రోజులు క్రితం అర్పిత ఇంట్లో రూ.21.9 కోట్లు పట్టుబడగా..బుధవారంనాడు మరో ఇంట్లో జరిపిన దాడుల్లో రూ.27.9 కోట్లు సీజ్‌ చేశారు. ఫ్లాట్‌లోని బెడ్ రూంతో పాటు వాష్ రూమ్‌లో దాచిన నగదు కట్టలు, బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. నగదులో ఎక్కువగా రూ.2,000, రూ.500 కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నాయి. అలాగే విదేశీ కరెన్సీ, ఇతర ఖరీదైన వస్తువులను కూడా ఈడీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అర్పితకు చెందిన రెండు ఇళ్ల నుంచి మొత్తం రూ.49.9 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

Ed Raids Partha Chatterjee

Ed Raids Partha Chatterjee

కాగా ఈడీ దాడులు, డబ్బు కట్టల స్వాధీనంకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రూ.27.9 కోట్ల నగదును నాలుగు క్యాష్ కౌంటింగ్ మిషన్ల ద్వారా ఎనిమిది మంది బ్యాంక్ అధికారులు లెక్కించారు. నోట్ల కట్టల లెక్కింపు పూర్తి చేసేందుకు వారికి 13 గం.ల సమయం పట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. నగదు లెక్కింపునకు ఈడీ అధికారులు ఎస్బీఐ అధికారులను పిలిపించారు. ఈడీ అధికారుల సమక్షంలో వారు బుధవారం సాయంత్రం 4.30 గం.లకు నాలుగు కరెన్సీ కౌంటింగ్ మిషన్ల ద్వారా కౌంటింగ్ మొదలుపెట్టారు. గురువారం ఉదయం 5.30 గం.ల వరకు నోట్ల కట్టల లెక్కింపును కొనసాగించారు. అర్పిత రెండో ఇంట్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.4.31 కోట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. ఉదయాన ట్రక్స్‌లో అక్కడ స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, విదేశీ కరెన్సీ, ఇతర విలువైన వస్తువులను ఈడీ కార్యాలయానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

గత శనివారం మంత్రి పార్థ ఛటర్జీతో పాటు అర్పితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ ఆగస్టు 3వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించారు. ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతున్న టైమ్‌లో మళ్లీ భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21.9 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పిత ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న నగదు కూడా ఆ కుంభకోణానికి సంబంధించినదేనని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అర్పితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఇప్పటి వరకు దాదాపు రూ.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. ఈ కుంభకోణంలో మొత్తం రూ.120 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అర్పితకు ఇంకెన్ని ఇళ్లు ఉన్నాయి.. వాటిలో ఇంకెన్ని కోట్లు ఉన్నాయి అన్న అనుమానాలతో ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు