AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birbhum Violence: బీర్భూమ్ హింసాకాండపై బీజేపీ నివేదిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బీర్భూమ్ హింసాకాండపై భారతీయ జనతా పార్టీ నిజనిర్ధారణ కమిటీ నివేదిక సీబీఐ విచారణకు ఆటంకం కలిగిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అన్నారు.

Birbhum Violence: బీర్భూమ్ హింసాకాండపై బీజేపీ నివేదిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Mamata
Balaraju Goud
|

Updated on: Mar 30, 2022 | 8:34 PM

Share

Birbhum Violence: బీర్భూమ్ హింసాకాండపై భారతీయ జనతా పార్టీ(BJP) నిజనిర్ధారణ కమిటీ నివేదిక సీబీఐ(CBI) విచారణకు ఆటంకం కలిగిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బుధవారం అన్నారు. ఈ నివేదికను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు సమర్పించారు. మార్చి 21న రాంపూర్‌హట్‌ సమీపంలోని బొగతుయ్‌ గ్రామంలో స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు బదు షేక్‌ హత్యకు గురైన తర్వాత కొన్ని ఇళ్లు తగులబెట్టగా, అందులో ఎనిమిది మంది సజీవదహనమై, ఒకరు గాయపడిన తర్వాత మరణించిన సంగతి తెలిసిందే. బీజేపీపై మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నివేదికలో టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మండల్ పేరు ఉందని, ఇది బీజేపీ ప్రతీకార వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోందని మమతా మండిపడ్డారు.

బొగతుయ్ హింసపై భారతీయ జనతా పార్టీ నివేదిక దర్యాప్తును బలహీనపరుస్తుందని, సీబీఐ దర్యాప్తులో జోక్యానికి దారి తీస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డార్జిలింగ్‌లో అన్నారు. కాషాయ పార్టీ వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. విచారణలో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోకూడదని అన్నారు. మమతా బెనర్జీ నా పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరును ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ పక్షపాత దోరణితో ప్రతీకార వైఖరి అవలంభిస్తుందన్నారు. సీబీఐ దర్యాప్తు పూర్తి చేయకుండా, వారు అతని పేరును ఎలా తీసుకుంటారు? దీంతో అతడిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది వ్యక్తిగత పగ. టీఎంసీ నేతలపై కుట్ర పన్నుతున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దీనిపై విచారణ చేపట్టిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Read Also….  Combat Helicopter: మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్మీకి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్లు.. ధర ఎంతో తెలుసా?