AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasad For Ram Mandir Ayodhya : అయోధ్య రామమందిరంలో ప్రసాదం వండేది ఇతనే.. 12 ప్రపంచ రికార్డులు సాధించిన ఈ చెఫ్.. ఇప్పుడు.

రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 7000 కిలోల హల్వాను ప్రసాదంగా తయారు చేస్తారు. 1.5 లక్షల మంది రామ భక్తుల కోసం రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఇంత పెద్ద పరిమాణంలో చేస్తున్న హల్వా తయారీ కోసం నాగ్‌పూర్ నుండి ఒక కడాయిని కూడా తెప్పించారు. సుమారు 1400 కిలోల బరువున్న ఈ కడాయిలోనే రాముల వారి ప్రసాదాన్ని తయారుచేస్తారు.

Prasad For Ram Mandir Ayodhya : అయోధ్య రామమందిరంలో ప్రసాదం వండేది ఇతనే.. 12 ప్రపంచ రికార్డులు సాధించిన ఈ చెఫ్.. ఇప్పుడు.
Prasad For Ram Mandir Ayodh
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2024 | 8:19 AM

Share

పురాణాల ప్రకారం,.. విష్ణుమూర్తి దశావతారాలలో రాముడు ఏడవ అవతారం. అంటే శాస్త్రాల ప్రకారం విష్ణువు, రాముడు వేరు కాదు.. ఇద్దరూ ఒకటే.. కానీ అయోధ్యలో విష్ణువు ‘రామ్ లల్లా’కి భోజనం వండుతాడు! అయితే ఈ విష్ణువు ఆ ‘విష్ణువు’ కాదు. నాగపూర్ నివాసి విష్ణు మనోహర్ ప్రసిద్ధ చెఫ్. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాముడికి ఏడు వేల కిలోల ఆహారాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆనందం లక్షన్నర మందికి పైగా సందర్శకులకు పంపిణీ చేయబడుతుంది. విష్ణువు ఆ ప్రసాదానికి ‘రామ్ హలువా’ అనే పేరు కూడా పెట్టాడు.

అయోధ్యలోని అద్భుతమైన రామమందిరాన్ని జనవరి 22న ప్రారంభించనున్నారు. రాముడు జన్మించిన భూమిలో రామమందిరాన్ని నిర్మించాలి. లక్షలాది మంది రామభక్తులు రాముడి సన్నిధి చేరుకోవాలనే కల ఇప్పుడు సాకారమవుతోంది. ఈ చారిత్రాత్మక క్షణం కోసం ప్రతి భారతీయుడు ఎదురుచూస్తున్నాడు. ఈ ప్రత్యేక సందర్భంలో అయోధ్య రామమందిరంలో 7000 కిలోల హల్వాను ప్రసాదం రూపంలో తయారు చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని రామ భక్తులకు పంచుతారు.

లక్షలాది మంది భక్తులకు ప్రసాద వితరణ:

ఇవి కూడా చదవండి

ఆలయ ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రామ్‌ లల్లా దర్శన భాగ్యం భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ తారలు, క్రికెట్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రసాదం సిద్ధం చేయడం వెనుక ఎవరి హస్తం ఉందోనని భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రసాదం కోసం 1400 కిలోల కడాయి:

రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 7000 కిలోల హల్వాను ప్రసాదం రూపంలో తయారుచేస్తారు. నాగ్‌పూర్‌కు చెందిన విష్ణు మనోహర్ ఈ భారీ మొత్తంలో హల్వాను తయారు చేసే బాధ్యతను తీసుకున్నాడు. 1.5 లక్షల మంది రామ భక్తుల కోసం రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఇంత పెద్ద పరిమాణంలో తయారు చేస్తున్న హల్వా కోసం నాగ్‌పూర్ నుండి ఒక కడాయిని కూడా తెప్పించారు. సుమారు 1400 కిలోల బరువున్న ఈ కడాయిలోనే రాముల వారి ప్రసాదాన్ని తయారుచేస్తారు.

అద్భుతమైన ప్రసాదం..:

ఈ హల్వా తయారీకి 900 కిలోల సెమ్యా, 1000 కిలోల పంచదార, 2500 లీటర్ల పాలు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 1000 కిలోల నెయ్యి, 2500 లీటర్ల నీటిని ఉపయోగిస్తారు. ఈ పదార్థాలన్నీ మిక్స్ చేసి హల్వా తయారు చేయడం నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి..

ఈ చెఫ్ 12 ప్రపంచ రికార్డులు సాధించారు.:

ఇకపోతే, రామ భక్తుల కోసం ప్రసాదం సిద్ధం చేస్తున్న విష్ణు మనోహర్ గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. విష్ణు అద్భుతమైన మిఠాయి వ్యాపారి. ఇప్పటి వరకు 12 ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చివరిసారిగా 285 నిమిషాల్లో అన్నం సహా 75 రకాల వంటకాలు సిద్ధం చేశారు. అతను స్పెషల్‌ కుక్కింగ్‌ క్లాసులకు వెళ్తుంటారు..ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటారు. ఆయన చేతుల మీదుగా తయారవుతున్న హల్వా ఇప్పుడు రామ భక్తులకు ప్రసాదంగా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..