Tunnel Collapse: టన్నెల్‌లోని కార్మికుల ప్రాణాలకోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. థాయ్ ఏజెన్సీతో సంప్రదింపులు

|

Nov 16, 2023 | 8:55 AM

ఉత్తరాఖండ్‌ లోని ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయి. నాలుగోరోజు విదేశాల నుంచి తెప్పించిన యంత్రాలతో సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు. ఉత్తరకాశీలో సహాయక చర్యల కోసం విదేశీ నిపుణుల సాయాన్ని కూడా అధికారులు తీసుఉంటున్నారు. సొరంగం నుంచి కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే దానిపై, థాయ్‌లాండ్, నార్వే నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సంప్రదించారు.

Tunnel Collapse: టన్నెల్‌లోని కార్మికుల ప్రాణాలకోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. థాయ్ ఏజెన్సీతో సంప్రదింపులు
Uttarkashi Tunnel Collapse
Follow us on

ఉత్తరాఖండ్‌ లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి సహాయక చర్యలను వేగవంతం చేశారు. టన్నెల్‌లో  ఇంకా 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నాలుగు రోజులు గడిచినా సహాయక చర్యలకు సాంకేతిక సమస్యల కారణంగా  అంతరాయం ఏర్పడుతోంది. చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు భారత వైమానిక దళం మూడు ప్రత్యేక విమానాల్లో 25 టన్నుల పైపులను పంపుతోంది. మరోవైపు సొరంగం నుంచి కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే దానిపై, థాయ్‌లాండ్, నార్వే నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సంప్రదించారు.

2018లో థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న చిన్నారులను రక్షించేందుకు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన సంస్థను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది కార్మికులు వారం రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టును రక్షించారు.  ఈ థాయ్ రెస్క్యూ ఆపరేషన్ బృందం అనుభవాన్ని ఉపయోగించి ఉత్తరకాశీలో కూలిపోయిన నిర్మాణ సొరంగం నుండి చిక్కుకున్న 40 మంది కార్మికులను ఎలా రక్షించాలనే దానిపై సహాయం కోరింది.

మరోవైపు వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పిస్తున్నారు. ఈ యంత్రం ఒక గంటలో 4-5 మీటర్ల వరకు రాళ్లను తవ్వగలదు. ఉత్తరకాశీ సొరంగంలో ఈ యంత్రాన్ని ఉపయోగించగలిగితే.. అక్కడ నుండి 90 మిమీ పెద్ద పైపును అమర్చవచ్చు.. దీని ద్వారా కార్మికులు సురక్షితంగా బయటకు రావచ్చు. గురువారం నుంచి ఈ యంత్రాన్ని వినియోగించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సొరంగం లోపల రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయవలసిందిగా జియోటెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నార్వేని కూడా కోరింది. భారతీయ రైల్వేలతో పాటు, రైల్ బికాష్ నిగమ్, రైల్ ఇండియా టెక్నికల్‌తో సహా పలు కేంద్ర ఏజెన్సీల నిపుణుల నుండి కూడా సలహాలను తీసుకుంటుంది.

ఇప్పటి వరకు చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు. వీరికి పైపుల ద్వారా ఆహారం, నీరు, ఆక్సిజన్‌ ​​అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్.. కార్మికుల కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్నికలిగించేలా వీరితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఉత్తరకాశీ సొరంగంలోని కార్మికులు తమ ప్రాణాల కోసం కాలంతో పోరాటం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..