AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన మహిళా ఉపాధ్యాయురాలు.. ఎందుకో తెలిసి అంతా షాక్..!

ఉత్తరప్రదేశ్‌ నుండి అత్యంత సున్నితమైన, కలతపెట్టే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. కళాశాల యాజమాన్యంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక మహిళా అధ్యాపకురాలు రక్తంతో రాసిన మెమోరాండంను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించింది. మానసిక, శారీరక వేధింపులతో బాధపడుతున్న ఆ ఉపాధ్యాయురాలు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి కోరింది.

రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన మహిళా ఉపాధ్యాయురాలు.. ఎందుకో తెలిసి అంతా షాక్..!
Female Teacher Letter With Blood
Balaraju Goud
|

Updated on: Jan 13, 2026 | 11:40 AM

Share

ఉత్తరప్రదేశ్‌ నుండి అత్యంత సున్నితమైన, కలతపెట్టే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. కళాశాల యాజమాన్యంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక మహిళా అధ్యాపకురాలు రక్తంతో రాసిన మెమోరాండంను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించింది. మానసిక, శారీరక వేధింపులతో బాధపడుతున్న ఆ ఉపాధ్యాయురాలు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి కోరింది. ఈ సంఘటన మొత్తం అధికారయంత్రంగంలో తీవ్ర కలకలం రేపింది.

బులంద్‌షహర్‌కు చెందిన నేహా (పేరు మార్చడం జరిగింది) 2022లో ఎంపికై బాగ్‌పత్‌లోని హజారీ లాల్ ఇంటర్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం (జనవరి 12), ఆ ఉపాధ్యాయురాలు తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చింది. తాను నియమితులైనప్పటి నుండి, కళాశాల అప్పటి ప్రిన్సిపాల్, ప్రస్తుత మేనేజర్ రాజేంద్ర సింగ్ భాటి తనను నిరంతరం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని నేహా ఆరోపించింది.

ఉపాధ్యాయురాలికి మద్దతుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో స్థానికలు ఆందోళన చేపట్టారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శన సందర్భంగా, ఒక ప్రత్యేకమైన, భయంకరమైన నిరసన పద్ధతిని అవలంబించారు. నిరసనకారులు తమ సొంత రక్తాన్ని సేకరించి, రాష్ట్రపతికి ఒక మెమోరాండం రాయడానికి ఉపయోగించారు. ఈ హింసను భరించే శక్తిని తాను కోల్పోయానని, ఇప్పుడు తన కుటుంబంతో పాటు మరణాన్ని కోరుకుంటున్నానని ఉపాధ్యాయురాలు లేఖలో స్పష్టంగా పేర్కొంది.

ఈ విషయంపై జిల్లా యంత్రాంగం నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు అందరికీ విజ్ఞప్తి చేశానని, కానీ కళాశాల యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయురాలు నేహా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ పరిపాలనా ఉదాసీనత వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం తీవ్రత దృష్ట్యా, మానవ హక్కుల సంస్థలు కూడా జోక్యం చేసుకుని నిష్పాక్షిక దర్యాప్తును డిమాండ్ చేశాయి. ఈ మెమోరాండంను అంగీకరిస్తూ, బాగ్‌పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us