AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Sunni Waqf Board: అక్కడ మసీదు, ఆసుపత్రి కూడా నిర్మిస్తాం.. సున్నీ వక్ఫ్ బోర్డు క్లారిటీ

అయోధ్యలో తమకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మసీదుతో బాటు ఓ ఆసుపత్రి, లైబ్రరీని కూడా నిర్మిస్తామని యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది.

Ayodhya Sunni Waqf Board: అక్కడ మసీదు, ఆసుపత్రి కూడా నిర్మిస్తాం.. సున్నీ వక్ఫ్ బోర్డు క్లారిటీ
Umakanth Rao
|

Updated on: Feb 25, 2020 | 6:38 PM

Share

అయోధ్యలో తమకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మసీదుతో బాటు ఓ ఆసుపత్రి, లైబ్రరీని కూడా నిర్మిస్తామని యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అయోధ్య కేసుగా కొన్ని దశాబ్దాల పాటు నలిగిన ఈ వివాదాస్పద అంశంలో రామ మందిర నిర్మాణానికి 2.77 ఎకరాల స్థలాన్ని రామ్ లీలా ట్రస్టుకు, 5 ఎకరాలను సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని 2019 లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నిచ్చింది. అయితే ఈ ఐదెకరాలను నిరాకరించాలని ఈ బోర్డు మొదట నిర్ణయించింది.  కానీ ఆ తరువాత మెత్తబడి.. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తమ వైఖరి అదే అయితే కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అవుతుందని భావించామని, అందువల్ల ఈ స్థలంలో మసీదు, ఆసుపత్రి, లైబ్రరీని కూడా నిర్మించాలని నిర్ణయించామని బోర్డు చైర్మన్ జఫర్ ఫారూఖీ తెలిపారు. మసీదును ఎంత మేర ఏ స్థలంలో నిర్మించాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు. మసీదు నిర్మాణం,  డిజైన్ తదితర అంశాలపై తమ బోర్డు మళ్ళీ సమావేశమవుతుందని ఆయన చెప్పారు. తాము కోర్టు ధిక్కారానికి పాల్పడతామని ఎవరైనా ఎలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో.. ‘వివాదరహితంగా ‘ మారిన ఈ స్థలంలో అసలు బోర్డు మసీదు నిర్మిస్తుందా అన్నదానిపై సస్పెన్స్ వీడిపోయింది.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం