AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే స్టేషన్ పేరునే మార్చేసిన ఆకతాయిలు

మహారాష్ట్రలో దుండగులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో కొందరు ప్లాట్ ఫారం మీద ఉన్న బోర్డుపై ఉన్న పేరునే మార్చేశారు. ఔరంగాబాద్ పేరుపై రంగు పూసి.. దానిపై సంభాజీ నగర్ అని రాశారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపారు. […]

రైల్వే స్టేషన్ పేరునే మార్చేసిన ఆకతాయిలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 1:49 PM

Share

మహారాష్ట్రలో దుండగులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో కొందరు ప్లాట్ ఫారం మీద ఉన్న బోర్డుపై ఉన్న పేరునే మార్చేశారు. ఔరంగాబాద్ పేరుపై రంగు పూసి.. దానిపై సంభాజీ నగర్ అని రాశారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపారు. బోర్డుపై మొదట రంగు పూశారని.. ఆ తర్వాత సంభాజీనగర్ అనే పేరు ఉన్న స్టిక్కర్‌ను అతికించారని వెల్లడించారు.