AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron JN.1 variant: కరోనా కొత్త వేరియంట్‎పై వీళ్లు భయపడాల్సిన పనిలేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు చాపకింద నీరులా పాకుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన జేఎన్.1 వేరియంట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళలో ఒక వ్యక్తి మృతి చెందగా.. గోవాలో అత్యధికంగా వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా డిశంబర్ 21 నాటికి 22 కొత్త వేరియంట్ కేసులు యాక్టీవ్ లో ఉన్నట్లు తెలిపారు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Omicron JN.1 variant: కరోనా కొత్త వేరియంట్‎పై వీళ్లు భయపడాల్సిన పనిలేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Union Tourism Minister
Srikar T
|

Updated on: Dec 24, 2023 | 11:33 PM

Share

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు చాపకింద నీరులా పాకుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన జేఎన్.1 వేరియంట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళలో ఒక వ్యక్తి మృతి చెందగా.. గోవాలో అత్యధికంగా 19 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా డిశంబర్ 21 నాటికి 22 కొత్త వేరియంట్ కేసులు యాక్టీవ్ లో ఉన్నట్లు తెలిపారు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు. ఇదిలా ఉంటే జేఎన్.1 కొత్త కరోనా వేరియంట్‎కి ఎవరూ భయపడనవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. దక్షిణ గోవాలో పాంచజన్య వార పత్రిక ఆదివారం నిర్వహించిన ‘సాగర్ మంథర్ 2.0’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరోనాతో మన దేశం గతేడాది పోరాడిందని.. ఇప్పుడు వచ్చే కొత్త వేరియంట్లపై ప్రజలు, పర్యటక పరిశ్రమలు ఎలాంటి భయాందోళనకు గురికానవసరం లేదని వివరించారు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలతో కరోనా బారినపడిన తరువాత కూడా అర్థికంగా చాలా త్వరగా కోలుకుందన్నారు. గతంలో కంటే కూడా కొత్త ఉపాధి అవకాశాలు టూరిజం రంగంలో పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త రకం కరోనాతో లాక్ డౌన్ విధించే అవకాశం ఉంటుందా అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘భయపడాల్సిన అవసరం లేదు. అది మళ్లీ వచ్చినా మనం పోరాడగలం. గతంలోనూ మనం ఈ మహమ్మారిపై పోరాడాం’’ అన్నారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని, ఆసుపత్రుల్లో పేషెంట్లకు బెడ్ల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే కరోనా సోకిన వారికి ఐసోలేషన్ లో ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, అత్యవసరం అయితే తప్ప వృద్దులు, పసిపిల్లలు బయటకు రాకుడదని సూచనలు జారీ చేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వాలు కరోనా పరీక్షలు పెద్ద ఎత్తులో చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...