అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక యువకుడి మృతదేహాన్ని.. ఎంత దారుణంగా తరలించారో తెలిస్తే..

అంబులెన్స్‌కు అంత డబ్బులు చెల్లించలేక ఒక కుటుంబం ఇబ్బందిపడింది. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం

అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక యువకుడి మృతదేహాన్ని.. ఎంత దారుణంగా తరలించారో తెలిస్తే..
Man Body On Vehicle Roof

Updated on: Dec 08, 2024 | 9:39 PM

ఉత్తరాఖండ్‌ హల్ద్వానీ జిల్లాలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. హల్దుచౌడ్‌లోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అభిషేక్ అనే 20ఏళ్ల యువకుడు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు పట్టాల వద్ద అతడి మృతదేహన్ని గుర్తించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.10 వేలకుపైగా డిమాండ్‌ చేశారు.

అంబులెన్స్‌కు అంత డబ్బులు చెల్లించలేక ఒక కుటుంబం ఇబ్బందిపడింది. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం టాప్‌పై యువకుడి మృతదేహాన్ని కట్టేసి గ్రామానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ విషయం తెలిసి ఉత్తరాఖండ్‌లో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించింది. దీంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై స్పందించారు. సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్‌ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us