Jammu Kashmir: ఉలిక్కిపడిన జమ్మూ కశ్మీర్.. వణికించిన పేలుళ్లు.. అమిత్ షా పర్యటనకు ముందే..

|

Sep 29, 2022 | 10:56 AM

జమ్ము కశ్మీర్‌ ను వరస బాంబు పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలు తీవ్ర కలకలం సృష్టించింది. ఉధంపూర్‌ లో ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. రెండు బస్సుల్లో...

Jammu Kashmir: ఉలిక్కిపడిన జమ్మూ కశ్మీర్.. వణికించిన పేలుళ్లు.. అమిత్ షా పర్యటనకు ముందే..
Blast
Follow us on

జమ్ము కశ్మీర్‌ ను వరస బాంబు పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలు తీవ్ర కలకలం సృష్టించింది. ఉధంపూర్‌ లో ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. రెండు బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం రాత్రి 10.30 సమయంలో దొమాయిల్‌ చౌక్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ సమీపంలో బస్సును పార్క్ చేశారు. బస్సులోని డ్రైవర్ క్యాబిన్ లో కండక్టర్‌ సునీల్‌ సింగ్‌, మరో వ్యక్తి ఉన్నారు. ఈ బస్సు నిత్యం ఉధంపూర్‌-రామ్‌ఘర్‌-బసంత్‌ఘర్‌కు ప్రయాణికులను చేరవేస్తోంది. అలా ప్రయాణీకులను దింపి వచ్చిన తర్వాత బస్సును నిలిపి ఉంచారు. కాగా ఆ సమయంలోనే బస్సులో పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వారిద్దరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా.. ఇది జరిగిన కొన్ని గంటలకే ఉధంపూర్‌లో మరో బస్సులో పేలుడు సంభవించడం తీవ్ర కలకలంగా మారింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఉధంపూర్‌ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరో మూడు రోజుల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుండగా ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది.ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..